రైతు ఉద్యమానికి తలొగ్గిన కేసీఆర్..!

సీఎం కేసీఆర్ ఇటీవలి కాలంలో తొలి సారి వెనక్కి తగ్గారు. తెలంగాణలో రైతులు పండిన మొక్కజొన్న పంటను ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. నిన్నటి వరకూ కేసీఆర్… మక్కలకు మద్దతు ఇచ్చి కొనుగోలు చేయడం అసాధ్యమని చెబుతూ వస్తున్నారు. ప్రభుత్వం వేయవద్దని చెప్పినా.. రైతులు పండించారని ప్రభుత్వం వాదిస్తూ వస్తోంది. అయితే.. కొద్ది రోజులుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతుల ఆందోళనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ప్రజాప్రతినిధుల ఇళ్లపై దాడులు చేసే పరిస్థితి వచ్చింది.

దీంతో కేసీఆర్ దిగిరాక తప్పలేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మక్కలను కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు రైతులు నష్టపోవద్దనే మక్కలు కొనుగోలు చేయాలని నిర్ణయించామని.. యాసంగిలో ఎట్టి పరిస్థితుల్లో మక్కలు సాగు చేయవద్దుని రైతులకు కేసీఆర్ సూచించారు. ఇంత చెప్పినా మళ్లీ ఎవరైనా మక్కలు సాగు చేస్తే ప్రభుత్వ బాధ్యత లేదని హెచ్చరించారు. యాసంగిలో పండే మక్కలను ప్రభుత్వం కొనుగోలు చేయదని తేల్చి చెప్పారు.

కేంద్రం మొక్కజొన్నలపై 50 శాతం ఉన్న దిగమతి సుంకాన్ని 15 శాతానికి తగ్గించిందని.. మక్కల ధర పడిపోవడానికి కారణమైన పార్టీ నేతలే చిల్లర రాజకీయాలు చేస్తున్నారు కేసీఆర్ మండిపడ్డారు. వారి మాటలు రైతులు నమ్మొద్దని పిలుపునిచ్చారు. ఆర్టీసీ సమ్మె సహా అనేక అంశాల్లో కేసీఆర్.. తాను అనుకున్న నిర్ణయానికే మొదటి నుంచి కట్టుబడ్డారు. అయితే రైతుల విషయానికి వచ్చే సరికి… విషయం సీరియస్ కాక ముందే… మక్కల కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close