ఇక పోలవరానికి పైసా కూడా ఇవ్వరా..!?

పోలవరం విషయంలో కేంద్రం నిధులకు పూర్తి స్థాయిలో కొర్రీలు పెడుతూండటంతో ఏపీ సర్కార్ చేతులెత్తేసే పరిస్థితికి వచ్చింది. ఇక తప్పదన్నట్లుగా గత ప్రభుత్వంపై నెట్టేస్తే సరిపోతుదన్న వ్యూహానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌తో సమావేశమైన తర్వాత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి .. నెపం అంతా టీడీపీపైకి నెట్టే ప్రయత్నం చేశారు. పోలవరం ఖర్చును పరిమితం చేయాలని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని బుగ్గన ఆరోపించారు. పోలవరం విషయంలో టీడీపీ ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందన్నారు. పోలవరం కాంట్రాక్టు పనులపైనే టీడీపీ ప్రభుత్వం దృష్టి పెట్టిందని.. ఇతర అంశాలు పట్టించుకోలేదన్నారు.

పోలవరాన్ని పూర్తిగా తామే నిర్మిస్తామని విభజన చట్టంలో కేంద్రం చెప్పిందని. పునరావాసం, భూసేకరణ ఖర్చు కేంద్రానిదే అని చట్టంలో ఉందని చెప్పుకొచ్చారు. అయితే.. కేంద్రం చేపట్టాల్సిన ప్రాజెక్ట్‌ను 2014లో రాష్ట్రం తీసుకుందని.. 2014 నాటి ఖర్చు ఇవ్వాలని గత ప్రభుత్వం తీర్మానం చేసిందని ఆరోపించారు. 2014కి ముందు పెట్టిన ఖర్చును ఇవ్వాలని గత ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేస్తూ వస్తోంది. టీడీపీ హయాంలో చివరి ఏడాది పోలవరానికి టెక్నికల్ అడ్వైజరీ కమిటీలో రూ.55,548 కోట్లకు ఆమోదం లభించింది కూడా. ఇక ఆర్థిక శాఖ ఆమోదమో తరువాయి అనే సమయంలో.. కేంద్రం 2014 నాటి ధరలను మాత్రమే లెక్కిస్తామని చెప్పి.. షాక్ ఇచ్చింది.

దీంతో పోలవరం బాధ్యత నుంచి కేంద్రం తప్పుకున్నట్లవుతుంది. కేంద్రంపై ఒత్తిడి చేసి… జాతీయ ప్రాజెక్టును నిర్మించుకోలేని స్థితికి ఏపీకి వచ్చినట్లయింది. కొసమెరుపేమిటంటే… ప్రస్తుతం.. పోలవరంపై పెట్టిన ఖర్చుోల రూ. 2234 కోట్లు రీఎంబర్స్ చేయాల్సి ఉంది. పార్లమెంట్‌లో కూడా.. ఇచ్చేస్తున్నాం అని కేంద్రమంత్రులు చెప్పారు. కానీ.. ప్రస్తుతం తగ్గించిన అంచనాలను ఆమోదిస్తేనే ఆ మొత్తం ఇస్తామని లేకపోతే.. అవి కూడా ఇవ్వలేమని.. నిర్మలా సీతారామన్ కేంద్రానికి తేల్చి చెప్పేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అంటే పోలవరం ప్రాజెక్ట్ పరిస్థితి ఇప్పుడు గాల్లో వేలాడుతోందన్నమాట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close