ఏడేళ్లలో దళితులకు లక్షా 70వేల కోట్లు !

దళిత బంధు పథకం విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లెక్కల్లో స్పష్టత ఉంది. మోత్కుపల్లి నర్సింహులకు పార్టీ కండువా కప్పే కార్యక్రమంలో దళిత బంధు పథకం విషయంలో తన పట్టుదలను మరోసారి మాటల్లో చెప్పారు. లెక్కలు కూడాచెప్పారు. వచ్చే ఏడేళ్లలో దళిత కుటుంబాలకు రూ. లక్షా 70వేల కోట్లను పంపిణీ చేస్తే వారు రూ. పది లక్షల కోట్లను సంపాదించుకుంటారని విశ్లేషించారు. మరి దళితులకు పంచడానికి రూ. లక్షా 70వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయంటే..దానికీ సమాధానం చెప్పారు.

ఏడేళ్లలో తెలంగాణ బడ్జెట్ రూ. 23 లక్షల కోట్లు. వాటిలో నుంచి దళితులకు రూ. 1 లక్షా 70వేల కోట్లు కేటాయించడం పెద్ద సమస్యేం కాదన్నారు. దళితులకు చేయాల్సింది చాలాఉందని.. దళిత బంధు కేవలం ఆరంభం మాత్రమేనన్నారు. కేసీఆర్ వచ్చే ఏడేళ్ల లెక్క మాత్రమే చెప్పారు. అంటే రెండేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధించడం ఖాయమని ఆయన గట్టి నమ్మకంతో ఉన్నారని అనుకోవాలి. ఈ సందర్భంగా మోత్కుపల్లిని కేసీఆర్ పొగడ్తలతో ముచెత్తారు. తాము కలిసి పని చేసిన రోజులను గుర్తు చేశారు.

విద్యుత్ మంత్రిగా మోత్కుపల్లి పని చేశారు.. ఈ సందర్భంగా కరెంట్ కష్టాలు ఎలా ఉంటాయో మోత్కుపల్లికి తెలుసని.. అలాంటివాటిని తాము అధిగమించామన్నారు. ఇటీవల మోత్కుపల్లి అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరినప్పుడు రూ. కోటి ఖర్చయినా సరే పర్లేదు.. ఆరోగ్యం మెరుగుపడాలని చెప్పానని గుర్తు చేసుకున్నారు. స్పీచ్ మధ్యలో కేసీఆర్ దేశంలో తనను తిట్టినంతగా ఏ నాయకుడ్ని తిట్టలేదని చెప్పుకున్నారు. గతంలో మోత్కుపల్లి కూడా తన టంగ్ పవర్‌ను కేసీఆర్‌పై చూపించారు. కానీ మోత్కుపల్లిని ఉద్దేశించి కాకుండా జనరల్‌గా మాట్లాడటంతో మోత్కుపల్లి కూడా ఊపిరి పీల్చుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close