వైసీపీ అధ్యక్షుడిగా రఘురామ .. పోటీ చేస్తారట !

వైసీపీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని వైసీపీ అధినేత రఘురామకృష్ణరాజు … సీఎం జగన్‌ను డిమాండ్ చేశారు. ఎందుకంటే ఆయన కూడా అధ్యక్ష పదవికి పోటీ చేస్తారట. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన టీఆర్ఎస్ అధినేత ఎన్నిక కోసం దాఖలవుతున్న నామినేషన్ల ప్రస్తావన రాగానే స్పందించారు. వైసీపీ అధ్యక్ష పదవికి ఎన్నిక పెడితే తాను కూడా పోటీ చేస్తానని ప్రకటించారు. ఇటీవలి కాలంలోవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సంస్థాగత ఎన్నికలు నిర్వహించిన దాఖలాలు లేవు. నిర్వహించేందుకు కూడా ఎలాంటి షెడ్యూల్ ప్రకటించలేదు.

అయినప్పటికీ రఘురామకృష్ణరాజు తాను పోటీకి సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. గత ఏడాదే అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించాల్సి ఉన్నా నిర్వహించలేదని.. ఈ సారి నిర్వహిస్తారేమో చూడాలన్నారు. ఈ ఏడాది కూడా అయిపోయింది కాబట్టి వచ్చే ఏడాది నిర్వహిస్తే పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రతి రాజకీయ పార్టీ విధిగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలి. ప్రజాస్వామ్య బద్దంగా పార్టీ కమిటీల ఎన్నికలను నిర్వహించాలి. ఆ సమాచారాన్ని ఎన్నికల సంఘానికి పంపాలి.

అందుకే ప్రతి రెండేళ్లకోసారి వివిధ రాజకీయ పార్టీలు ప్లీనరీలు నిర్వహిస్తూ ఉంటాయి. ఈ ప్లీనరీ కంటే ముందే పార్టీ కమిటీల నిర్మాణం పూర్తి చేస్తారు. కానీ వైసీపీ మాత్రం భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటుంది. పెద్దగా సంస్థాగతఎన్నికలు జరుగుతున్న సందర్భాలే ఉండవు. అందుకే సెటైరిక్‌గా తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉందని నిరూపించడానికే అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని రఘురామ చెప్పుకొచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close