దటీజ్ కేసీఆర్..! ఇంకెవరైనా టీఆర్ఎస్ పనైపోయిందంటారా..?

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణిదేవి విజయం సాధించారు. వరంగల్ , నల్లగొండ, ఖమ్మం స్థానంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయంపై పెద్దగా ఎవరూ అపనమ్మకం పెట్టుకోలేదు. అద్భుతం జరుగుతుందని ఆశించారు కానీ… అలాంటిదేమీ జరగలేదు. కానీ హైదరాబాద్ స్థానంలో మాత్రం అద్భుతమే జరిగింది. అది కేవలం కేసీఆర్ రాజకీయ వ్యూహాల ప్రకారమే జరిగింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుస్తుందని.. ఎవరూ అనుకోలేదు. ఓ రకంగా చెప్పాలంటే.. టీఆర్ఎస్ అధినేతకు కూడా నమ్మకం లేదు. అందుకే చివరి క్షణం వరకూ అభ్యర్థిని ఖరారు చేయలేదు. అభ్యర్థిని పెట్టి.. ఓడిపోతే… వచ్చే డ్యామేజ్ వేరు. అందుకే ప్రొ.నాగేశ్వర్‌కు మద్దతివ్వాలనుకుంటున్నట్లుగా లీకులు పంపారు.

అప్పటికే పల్లా పేరును ఖరారు చేసి బీఫాం కూడా ఇచ్చేశారు. ఆయన ప్రచారంలోకి దిగేశారు. హైదరాబాద్ అభ్యర్థిని ఖరారు చేయకపోవడంతో… ఇక వదిలేశారని అనుకున్నారు. కానీ నామినేషన్లు ముగియడానికి రెండు రోజుల ముందు కేసీఆర్ తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించారు. పీవీ కుమార్తెకు గెలుపు హామీ ఇచ్చి పోటీకి నిలబెట్టారు. అనుకున్నది అనుకున్నట్లుగా ప్రచారం చేశారు. సురభి వాణిదేవిని అభ్యర్థిగా నిలబెట్టడంతో బీజేపీ ఒక్క సారిగా షాక్‌ కు గురయ్యింది. దీనికి కారణం… హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అత్యధిక పట్టభద్ర ఓటర్లు బ్రాహ్మణసామాజికవర్గం వారు. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు కూడా అదే సామాజికవర్గం. అందుకే తన గెలుపునకు ఢోకా ఉండదని ఆయన విశ్వాసం.

అయితే అదే సామాజికవర్గానికి చెందిన పీవీ కుమార్తెను రంగంలోకి దించడం… ప్రధాని స్థాయిలో పని చేసిన ఆయన కుమార్తెకు ఓటు వేయకుండా ఆ సామాజికవర్గం ఎలా ఉంటుదనే ఆలోచన రావడంతో.. బీజేపీకి కూడా చెమటలు పట్టాయి. అందుకే ఎప్పుడూ లేని విధంగా బహిరంగంగా బ్రాహ్మణ కార్డును ఉపయోగించారు. పీవీ కుమార్తెను నిలబెట్టినా.. బ్రాహ్మణ ఓట్లన్నీ తనకే పడతాయని ప్రచారం చేసుకున్నారు. కొంత వరకూ పడ్డాయేమో కానీ… పూర్తి స్థాయిలో పడలేదు. ఫలితాలు చూసి.. బీజేపీ నేతలకు మైండ్ బ్లాంక్ అయింది. కేసీఆర్ రాజకీయ వ్యూహాల ముందు సరి తూగలేమని వారికి తేలిపోయింది.

పట్టభద్రులు… తెలంగాణ సర్కార్ పైఆగ్రహంతో ఉన్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుండి అదే పరిస్థితి. పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఎప్పుడూఎదురు దెబ్బలు తలుగుతూనే ఉన్నాయి. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో … కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి గెలిచారు. గతంలో రామచంద్రరావు గెలిచారు. పల్లా ఒక్కరు మాత్రం గతంలో గెలిచారు. ఇప్పుడు.. అది కూడా పోతుందేమో అన్నతంగా ప్రచారం జరిగింది. కేసీఆర్… ప్రగతిభవన్ దాటకుండా… రాజకీయ పరిస్థితులు తన చేయి దాటకుండా… చూసుకున్నారు. అందుకే దటీజ్ కేసీఆర్ అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close