కేసీఆర్‌కు “బెంగాల్” భయం..!

కోరి తెచ్చుకున్న హుజూరాబాద్ ఉపఎన్నికలో ఫలితం తేడా వస్తే తెలంగాణ మరో బెంగాల్ అవుతుందన్న ఆందోళన టీఆర్ఎస్‌లో కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్.. అనవసరంగా బీజేపీకి చాన్సిచ్చామన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. ముందు నుంచి ఈటల రాజేందర్ సొంత పార్టీ ఆలోచనలో ఉన్నారని ఇంటలిజెన్స్ నివేదికలను కేసీఆర్ నమ్మారు. రేవంత్, కోదండరాం వంటి వారితో కలిసి ఆయన కొత్త పార్టీ ఆలోచన చేస్తున్నారని…భావించారు. కానీ చివరికి ఈటల తనకు అలాంటి ఆలోచనలే లేవని నేరుగా బీజేపీలో చేరిపోయారు. బీజేపీ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఆట మొదలైంది అనే సంకేతాన్ని కేసీఆర్‌కు పంపుతోంది.

హుజురాబాద్ లో విజయంతో 2023 ఎన్నికల కు వెళ్లాలని బీజేపీ పట్టుదలగా ఉంది. బెంగాల్ తరహా పోరాటం చేస్తామని బీజేపీ చెబుతోంది. తమ తర్వాతి టార్గెట్ తెలంగాణే నని ఇప్పటికే ఆ పార్టీ జాతీయ నాయకులు ప్రకటించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం.. గ్రేటర్ ఎన్నికల్లో మమంచి ఫలితాలు బీజేపీ కి బూస్ట్ నిచ్చాయి. అయితే ఆ తర్వాత జరిగిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ సత్తా చాటింది. ఆ ఫలితాలు బీజేపీని తీవ్రంగా నిరాశ పరిచాయి. మళ్ళీ దూకుడు పెంచడానికి సమయం కోసం ఆ పార్టీ ఎదురు చూస్తోంది. అయితే తిరిగి పుంజుకోవడానికి హుజురాబాద్ ఉప ఎన్నిక అందివచ్చిన అవకాశంగా కమలదళం భావిస్తోంది.

దుబ్బాకలో గెలిచిన తర్వాత బీజేపీ నేతల దూకుడుకు టీఆర్ఎస్ నేతలు ఇబ్బందిపడాల్సి వచ్చింది. ఇప్పుడు హుజురాబాద్ లో గెలిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో కూడా టీఆర్ఎస్ అధినేతకు అంచనా ఉంది. అందుకే అక్కడ బీజేపీకి ఎట్టిపరిస్థితుల్లో గెలిచే అవకాశం ఇవ్వకూడదని పట్టుదలతో ఉన్నారు. స్వయంగా వ్యూహాలు రచిస్తున్నారు. స్వయంగా హుజూరాబాద్‌లో రెండు, మూడు బహిరంగసభలు పెట్టాలని అనుకుంటున్నారు. పరిస్థితిని బట్టి… కేసీఆర్.. నిర్ణయాలు తీసుకుంటారు. ఎంత చేసినా బీజేపీకే ఊపు ఉందనిపిస్తే.. ఆయన రివర్స్ గేర్ వేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close