ఆదిత్యనాథ్‌ను రిటైర్ చేయించాలని టీడీపీ ఫిర్యాదు..!

ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలం పొడిగింపు వ్యవహారం రాజకీయ వివాదాలకు కేంద్రం అవుతోంది. ఇప్పటికే ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలాన్ని ఆరు నెలల పాటు పెంచాలని ఏపీ ప్రభుత్వం .. కేంద్రానికి లేఖ రాసింది.ఆయన సేవలు ప్రస్తుతం చాలా అవసరం అని చెబుతోంది. అదే సమయంలో ఆదిత్యనాథ్ దాస్ కు పొడిగింపు ఇవ్వవొద్దని తెలుగుదేశం పార్టీ తరపున ఆ పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్.. డీవోపీటీకి లేఖ రాశారు. అందులో ఆదిత్యనాథ్ దాస్ .. సీఎస్‌గా తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు మాత్రమే కాదు… జగన్ కేసులో నిందితుడిగా ఉన్నారని.. ఆ కేసుల్లో క్విడ్ ప్రో కో కింద లంచాలు ఇచ్చినట్లుగా ఆరోపణలు ఉన్న ఇండియా సిమెంట్స్ సంస్థకు.. సీఎస్‌గా మరిన్ని మేళ్లు చేశారని.. ఆరోపిస్తూ.. లేఖకు ఆధారాలు జత చేశారు.

సీఎస్‌గా ఆదిత్యనాథ్‌ను కొనసాగిస్తే.. ప్రజాస్వామ్యానికి ఇబ్బందికరమని.. ఎంపీ లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు డీవోపీటికి ఫిర్యాదులు అందడంతో… కేంద్రం .. ఆదిత్యనాథ్ దాస్‌కు పొడిగింపు ఇస్తుందా లేదా అన్నది సందేహంగా మారింది. కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఉంటే.. పొడిగింపు లభిస్తోంది. చంద్రబాబు హయాంలో… ఎవరికీ పెద్దగా పొడిగింపులు ఇవ్వలేదు. అయితే ఇటీవల కరోనా కారణంగా కీలక అధికారులు మధ్యలో రిటైరైతే.. తదుపరి చర్యలకు ఇబ్బందికరం అన్న అభిప్రాయాలు వినిపించడంతో రాష్ట్రాల విజ్ఞప్తుల మేరకు పదవీ కాలం పొడిగిస్తున్నారు.

గరిష్టంగా ఆరు నెలలు మాత్రమే పొడిగింపు లభిస్తోంది. అయితే సాధారణంగా.. సీఎస్‌ల పదవీ కాలం పొడిగింపు అనేది ప్రభుత్వాలకు సంబంధించినదే అయి ఉంటుంది. ప్రతిపక్షాలు ఫిర్యాదులు చేసేది తక్కువే. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. డీవోపీటీకి … బెంగాల్ సీఎస్ పదవీ కాలం పొడిగింపు వ్యవహారం … ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు ఏపీ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close