కుల రాజకీయాలపై కెసిఆర్ సంచలన వ్యాఖ్యలు

కుల రాజకీయాలపై కెసిఆర్ వ్యాఖ్యలు చేసారు. ప్రజలు ఇష్యూ బేస్డ్ గా స్పందిస్తారు తప్పితే కులాన్ని బేస్ చేసుకుని స్పందించరని వ్యాఖ్యానించారాయన.

ఎన్టీఆర్ చాలా సార్లు, “తమ్ముడూ నువ్వు ప్రతిభావంతుడువి కానీ నీకు మంత్రి పదవి ఇద్దామంటే కులసమీకరణాలు వర్కవుట్ కావడం లేదు” అన్నారని, అందుకే తనకి మంత్రి కావడానికి 13 సంవత్సరాలు పట్టిందని అన్నారు. అయితే తాను ఈ విషయం లో ఎన్టీఆర్ తో చాలా సార్లు విభేదించినట్లు చెప్పారు. “అన్నగారూ మీకు ఎవరో రాంగ్ ఇంఫర్మేషన్ ఇస్తున్నారు, ప్రజలు ఇష్యూ బేస్డ్ గా స్పందిస్తారు తప్పితే కులాన్ని బేస్ చేసుకుని స్పందించరు. నేనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, మా సిద్దిపేట లో మా కులం ఓట్లు 120 కి మించి ఉండవు కానీ ప్రజలు నన్ను గెలిపిస్తున్నారు” అని తాను ఆయనతో అన్నట్టు చెప్పారు.

ఏది ఏమైనా, ప్రజలు ఇష్యూ బేస్డ్ గా స్పందిస్తారు తప్పితే కులాన్ని బేస్ చేసుకుని కాదు అని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కెసిఆర్ చెప్పడం ముదావహం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.