తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పర్సనల్ ఆస్పత్రి యశోదా. యశోదా ఆస్పత్రి .. బీఆర్ఎస్ నేతలకు.. బీఆర్ఎస్ అగ్రనేతలకు అత్యంత నమ్మకమైన ఆస్పత్రి. ఎలాంటి ట్రీట్మెంట్ అయినా అక్కడే చేయించుకుంటారు. ఆస్పత్రికి వెళ్లి చేయించుకోవాల్సిన సాధారణ ఆరోగ్య పరీక్షలను కూడాకేసీఆర్ యశోదాలోనే చేయించుకుంటారు. యశోదా యాజమాన్యంతో కేసీఆర్ కు దగ్గర సంబంధాలు ఉన్నాయి.. బంధువులు కూడా అని చెబుతారు.
కానీ ఇప్పుడు కేసీఆర్ తన సాధారణ వైద్య పరీక్షల కోసం యశోదాకు వెళ్లడం లేదు. ఏఐజీకి వెళ్తున్నారు. గత కొంత కాలంగా ఏఐజీకే వెళ్తున్నారు. రెండు రోజుల నుంచి వైద్య పరీక్షల కోసం ఏఐజీకి వెళ్తున్నారు. శనివారం ఉదయం ఆహారం తీసుకోకుండా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షల కోసం ఏఐజీకి వెళ్లారు. ఆయన వెంటే కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు. మరో ఐదురోజుల పాటు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
యశోదా ఆస్పత్రి కూడా హైటెక్ సిటీలో అతి పెద్ద ఆస్పత్రి నిర్మించింది. ఏఐజీ కంటే పెద్ద ఆస్పత్రి. స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ టెక్నాలజీ అందులో ఉంది. అయినా అక్కడ చికిత్స, వైద్య పరీక్షలకు కేసీఆర్ ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఏఐజీ ఆస్పత్రి అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో ఉంటుంది. ఇటీవలి కాలంలో రాజకీయ నేతలంతా ఆ ఆస్పత్రిలో చికిత్స తీసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు.