డేరింగ్ అండ్ డాషింగ్ కేజ్రీవాల్

అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి వచ్చి అవినీతి కేసులో అరెస్టు అయ్యాడన్న ప్రచారం చేస్తున్నారు. సామాన్యుడు కాదు లంచగొండి అని గట్టిగా ప్రజల మైండ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తన సీఎం పీఠం ఏమవుతుందో అనే భయం కల్పిస్తున్నారు. అయినా కేజ్రీవాల్ ఏ మాత్రం తగ్గడం లేదు. తన పోరాటం చేస్తున్నారు. వ్యవస్థల మీద ఎలాంటి అభిప్రాయం ఉన్నా.. అంతిమంగా న్యాయస్థానమే కావడంతో ఆయన పోరాటం చేస్తున్నారు. కానీ తాను ఎక్కడా తగ్గేది లేదని నిరూపిస్తున్నారు.

ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో జరిగిన విచారణలో భాగంగా తన కేసు గురించి కేజ్రీవాల్ తానే వాదించుకున్నారు. ఎవరైనా లాయర్ ను పెట్టుకుంటే కస్టడీకి ఇవ్వొద్దని వాదించుకుంటారు. కానీ కేజ్రీవాల్ వేరు. ఈడీకి ఎన్ని రోజులు కస్టడి కావాలంటే అన్ని రోజులు ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తికి చెప్పారు. ఈ సందర్భంగా తన వాదనలను బలంగా వినిపించారు. ఈ కేసులో తనను అరెస్ట్‌ చేసేందుకు తగిన ఆధారాలు ఈడీ వద్ద లేవని తెలిపారు. ఏ కోర్టు కూడా తనను దోషిగా పరిగణించలేదని కేజ్రీవాల్ కోర్టు ముందు వాదించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ దాఖలు చేసిన 31 వేల పేజీల ఛార్జిషీట్‌లో, ఈడీ దాఖలు చేసిన 25వేల పేజీల ఛార్జిషీట్‌లో ఎక్కడా తన పేరు లేదని … అయినా తనను ఎందుకు అరెస్ట్‌ చేశారని కేజ్రీవాల్ ప్రశ్నించారు.

కేసులో ఇరికించడమే లక్ష్యంగా ఈడీ అధికారులు ప్రవర్తిస్తున్నారని కేజ్రీవాల్ వాదించారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన మాగుంట రాఘవరెడ్డి ఇచ్చి 7 స్టేట్‌మెంట్లలో 6 స్టేట్‌మెంట్లలో తన పేరు లేదని చెప్పారు. శరత్‌ చంద్రారెడ్డి అరెస్ట్‌ తర్వాత రూ. 55 కోట్లు ఎలక్టోరల్‌ బాండ్స్‌ ద్వారా బీజేపీకి ఇచ్చాడని ఈ సందర్భంగా కేజ్రీవాల్ గుర్తు చేశారు. శరత్ చంద్రారెడ్డితో బలవంతంగా తన పేరు చెప్పించారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఈడీ అధికారులకు రెండు లక్ష్యాలు ఉన్నాయని పేర్కొన్న కేజ్రీవాల్.. అందులో ఒకటి తనను ఈ కేసులో ఇరికించడం.. రెండోది ఆప్‌ను లేకుండా చేయడమేనని కోర్టు ముందు చెప్పారు.

ఢిల్లీ లిక్కర్ కేసులో ఎంత నిజం ఉందో ఎంత అబద్దం ఉందో కానీ.. అది పూర్తిగా రాజకీయ కోణంలో అవసరమైనప్పుడే తెరపైకి వస్తున్న కేసన్న అభిప్రాయం జనంలో ఉంది. ఈ విషయంలో కేజ్రీవాల్ బాధితుడిగా ప్రజల మద్దతు పొందుతున్నారనుకోవచ్చు.. దీనికి కారణం ఈడీ యాక్షన్ చేస్తున్న టైమింగే కారణం అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

LRS అమలుతో తెలంగాణ రియల్ ఎస్టేట్‌కు ఊపు !

తెలంగాణలో లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(LRS)‌ను అమల్లోకి తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు క్లియర్‌ అవ్వని LRS సమస్యలను.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలని...

తిరుమ‌ల‌లో ప్ర‌క్షాళ‌న మొద‌లు… మంచి రోజులొచ్చిన‌ట్లే!

తిరుమ‌ల వెంక‌న్న ద‌ర్శ‌నం అంటే దేశ‌, విదేశాల నుండి వ‌స్తుంటారు. ఉత్త‌రాధి నుండి తిరుమ‌ల‌కు ఒక్క‌సారి వెళ్లి రావాల‌న్న వారు అధికంగా ఉంటారు. వెంక‌టేశ్వేర స్వామి వారి ద‌ర్శ‌నం కోసం ఎంత క‌ష్ట‌మైన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close