విజయవాడ వెస్ట్ రివ్యూ : సుజనా చౌదరి నమ్మకమేంటి ?

ఏపీలో పొత్తుల్లో భాగంగా బీజేపీకి వెళ్లిన నియోజకవర్గం విజయవాడ వెస్ట్. అక్కడ్నుంచి అభ్యర్థిగా సుజనా చౌదరిని ఖరారు చేయడంతో కూటమిలోని పార్టీలు కూడా ఒప్పుకోక తప్పలేదు. నిజానికి అక్కడ జనసేన తరపున పోతిన మహేష్ గట్టిగా పోరాడుతూ వస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ.. కొంత కాలం మంత్రిగా చేసిన వెల్లంపల్లిపై ఆయన గట్టి పోరాటం చేశారు. కానీ వెల్లంపల్లిని వైసీపీ అధినేత సెంట్రల్‌కు పంపితే.. పోతినకు అసలు టిక్కెట్ లేకుండా పోయింది. దీంతో ఐదేళ్లుగా తెర మీద లేని కొత్త అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ లోక్‌సభ పరిధిలోని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 1967లో ఏర్పడింది. మొత్తం విజయవాడ పాత నగరం పరిధిలో ఉండే ఈ నియోజికవర్గం పూర్తిగా అర్బన్‌ ప్రాంతం. ప్రస్తుతం వెలంపల్లి శ్రీనివాసరావు వైసీపీ నంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయన సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీపడుతున్నారు. వైసీపీ నుంచి షేక్ అసిఫ్‌ కు టిక్కెట్ ఇచ్చారు. అంటే పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ వర్సెస్ వైసీపీ పోరు ఖాయమయింది.

సాధారణంగా విజయవాడ అంటే టీడీపీ కంచుకోట అనుకుంటారు. కానీ విజయవాడ సిటీలోని పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ ఎక్కువ సార్లు గెలవలేదు. పొత్తుల్లో భాగంగా ఈ సీటును మిత్రపక్షాలకు కేటాయించేందుకు టీడీపీ ఆసక్తి చూపించేంది. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత 1983 లో ఆ పార్టీ గెలిచింది. 1985లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, వామపక్షాల పొత్తులో భాగంగా ఈ సీటు సీపీఐకి కేటాయించారు. టీడీపీ మద్దతు సీపీఐ గెలిచింది కానీ మళ్లీ టీడీపీ అక్కడ గెలిచిన సందర్భం లేదు. మిత్రపక్షాలు మాత్రం గెలిచాయి. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసిన వెలంపల్లి శ్రీనివాసరావు గెలిచారు. తర్వాత రాజకీయ పరిణామాల్లో ఆయన వైసీపీలో చేరి గత ఎన్నికల్లో గెలిచారు. ఇప్పుడు నియోజకవర్గానికి దూరమయ్యారు.

పశ్చిమ నియోజకవర్గంలో సామాజికవర్గాల పరంగా ఓట్లు కూడా భిన్నంగా ఉంటాయి. ముస్లిం ఓట్లు 40వేల వరకూ ఉంటాయి. కానీ అంతకు రెండింతలు ఇతరుల ఓట్లుఉంటాయి. కాపు సామాజికవర్గం కిందకు వచ్చే నగరాల వర్గం వారి ఓట్లు 40వేలకుపైగానే ఉంటాయి. వైశ్య వర్గానికి చెందిన వారు పద్దెనిమిది, బ్రాహ్మణులు పదివేలు, కమ్మ సామాజికవర్గం వారు ఐదు వేల మంది ఉంటారు. బీజేపీ పోటీ చేయడం వల్ల ఓట్లు పోలరైజ్ అయ్యే అవకాశం ఉంది. బీజేపీ పోటీ చేసే ప్రతీ చోటా.. కులానికన్నా మతానికి ప్రాధాన్యం లభిస్తుంది. అందుకే సామాజికవర్గంతో సంబంధం లేకుండా సుజనా చౌదరి బరిలోకి దిగడానికి ఆసక్తి చూపించారు.

ఇప్పుడు సుజనా చౌదరి ఓ బిగ్ లీడర్ గా బరిలో ఉండగా ఆయనకు .. పెద్దగా ఎవరికీ తెలియని నేతను పోటీగా పెట్టారు వైసీపీ అధినేత. గత మూడు ఎన్నికల ఫ లితాలను పరిశీలిస్తే… నియోజకవర్గ స్థాయి నేతలు పోటీ పడినా.. పోరాటం హోరాహోరీగా సాగింది. ఈ సారి కూడా అలాగే ఉండే అవకాశం ఉంది. బీజేపీ ఓట్ల పోలరైజేషన్ వ్యూహం పాటిస్తుంది కాబట్టి..సుజనా చౌదరికి అడ్వాంటేజ్ అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close