ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక సాక్ష్యం “నగదుకు మాత్రమే” మద్యం అమ్మకాలు

ఏపీలో మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్ ఎందుకు తీసుకోరో ఎవరికీ తెలియదు. కానీ విపక్ష పార్టీలు మాత్రం తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉంటాయి. పెద్ద ఎత్తున హవాలా నగదు ఆ వ్యాపారం ద్వారా వస్తుందని.. మొత్తం అన్ని స్థాయిలో వైసీపీ నేతల ప్రమేయం ఉందని.. కొన్నివేల కట్లు అలా తరలి పోతోందని ఆరోపిస్తూ ఉంటారు. అయితే ఎలాంటి విచారణ జరగలేదు.. లింకులు బయటకు రాలేదు. ఢిల్లీలో బయటపడిన లిక్కర్ స్కాం వ్యవహారంలోనూ ఈ నగదు లావాదేవీల అంశం కీలకంగా మారింది.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో తాజాగా ఈడీ దాఖలు చేసిన చార్జిషీటు లో ఈ వివరాలు చెప్పారు. శరత్ చంద్రారెడ్డికి చెందిన కంపెనీలకు ఢిల్లీలో కొన్ని జోన్లలో లిక్కర్ వ్యాపారం దక్కింది. ఈ లిక్కర్ వ్యాపారం కోసం తెరిచిన దుకాణాల్లో కేవలం నగదు లావాదేవీలు మాత్రమే జరిగాయట. ఆన్ లైన్ చెల్లింపులు అంగీకరించలేదని.. . ఇలా రోజు వచ్చే నగదును ఓ రహస్య ప్రాంతానికి తరలించారని చార్జిషీటులో ఈడీ చెబుతోంది. లిక్కర్ స్కాం కేసులో శరత్ చంద్రారెడ్డే కింగ్ పిన్ అని చెబుతున్నారు

కల్వకుంట్ల కవిత తరపున బినామీగా అరుణ్ రామచంద్ర పిళ్లై వ్యవహరిస్తున్నారని ఈడీ చెబుతోంది. దీనికి సంబంధించిన పలు వివరాలను చార్జిషీటులో పొందుపరిచారు. కవిత నివాసంలో నిందితులు పలుమార్లు భేటీ అయ్యారని ఈడీ చెబుతోంది. శరత్ రెడ్డి భార్యకు చెందిన విమానాల్లో తిరిగారని అంటున్నారు. శరత్ రెడ్డి … విజయసాయిరెడ్డి అల్లుడికి అన్న. ఈడీ చార్జిషీటు క్లియర్ గా ఉండటంతో.. ముందు ముందు ఈ కేసులో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు – జైలు – వాయిదాలు !

ఎఫ్ఐఆర్ కూడా లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కానీ న్యాయం కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్లపై తీర్పులు మాత్రం.. అంత వేగంగా రావడం లేదు. ఎప్పుడొస్తాయో తెలియదన్నట్లుగా సీన్...

అనసూయ కన్నీళ్లకి అసలు కారణం ఇదే

యాంకర్, నటి అనసూయ ఇటివలే షేర్‌ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో ఆమె కన్నీటి పర్యంతమవుతూ కనిపించారు. ఆన్‌లైన్‌ల ట్రోల్స్ వల్లే ఆమె కన్నీళ్లు పెట్టుకుందని నెట్టింట ప్రచారం...

ప్రభాస్ ‘కల్కి’తో జాగ్రత్త!

ప్రభాస్‌ తో నాగ్ అశ్విన్‌ రూపొందిస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’. కమల్‌ హాసన్‌ విలన్‌, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, దీపిక పదుకొణె, దిశా పటానీ ఇలా...

అసెంబ్లీలో 10 మంది టీడీపీ ఎమ్మెల్యేల్ని ఎదుర్కోలేక నైతిక పతనమైన వైసీపీ!

అసెంబ్లీలో వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీకి గట్టిగా పదిహేను మంది ఉన్నారు. వారిలో ఐదుగురు సైలెంట్ గా ఉంటారు. మహా అయితే గట్టిగా ఓ పది మంది టీడీపీ సభ్యులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close