ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక సాక్ష్యం “నగదుకు మాత్రమే” మద్యం అమ్మకాలు

ఏపీలో మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్ ఎందుకు తీసుకోరో ఎవరికీ తెలియదు. కానీ విపక్ష పార్టీలు మాత్రం తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉంటాయి. పెద్ద ఎత్తున హవాలా నగదు ఆ వ్యాపారం ద్వారా వస్తుందని.. మొత్తం అన్ని స్థాయిలో వైసీపీ నేతల ప్రమేయం ఉందని.. కొన్నివేల కట్లు అలా తరలి పోతోందని ఆరోపిస్తూ ఉంటారు. అయితే ఎలాంటి విచారణ జరగలేదు.. లింకులు బయటకు రాలేదు. ఢిల్లీలో బయటపడిన లిక్కర్ స్కాం వ్యవహారంలోనూ ఈ నగదు లావాదేవీల అంశం కీలకంగా మారింది.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో తాజాగా ఈడీ దాఖలు చేసిన చార్జిషీటు లో ఈ వివరాలు చెప్పారు. శరత్ చంద్రారెడ్డికి చెందిన కంపెనీలకు ఢిల్లీలో కొన్ని జోన్లలో లిక్కర్ వ్యాపారం దక్కింది. ఈ లిక్కర్ వ్యాపారం కోసం తెరిచిన దుకాణాల్లో కేవలం నగదు లావాదేవీలు మాత్రమే జరిగాయట. ఆన్ లైన్ చెల్లింపులు అంగీకరించలేదని.. . ఇలా రోజు వచ్చే నగదును ఓ రహస్య ప్రాంతానికి తరలించారని చార్జిషీటులో ఈడీ చెబుతోంది. లిక్కర్ స్కాం కేసులో శరత్ చంద్రారెడ్డే కింగ్ పిన్ అని చెబుతున్నారు

కల్వకుంట్ల కవిత తరపున బినామీగా అరుణ్ రామచంద్ర పిళ్లై వ్యవహరిస్తున్నారని ఈడీ చెబుతోంది. దీనికి సంబంధించిన పలు వివరాలను చార్జిషీటులో పొందుపరిచారు. కవిత నివాసంలో నిందితులు పలుమార్లు భేటీ అయ్యారని ఈడీ చెబుతోంది. శరత్ రెడ్డి భార్యకు చెందిన విమానాల్లో తిరిగారని అంటున్నారు. శరత్ రెడ్డి … విజయసాయిరెడ్డి అల్లుడికి అన్న. ఈడీ చార్జిషీటు క్లియర్ గా ఉండటంతో.. ముందు ముందు ఈ కేసులో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close