శ్రుతిహాస‌న్ క‌మెడియ‌న్‌గా మారిపోయిందా?

ఈ సంక్రాంతి శ్రుతిహాసన్‌దే. ఈ పండ‌క్కి పోటా పోటీగా విడుద‌ల కాబోతున్న వీర సింహారెడ్డి, వాల్తేరు వీర‌య్య చిత్రాల్లో తాను క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఈ రెండింటిపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఒక్క‌టి హిట్ అయినా.. శ్రుతి కెరీర్ టాప్ గేరులో దూసుకుపోవ‌డం ఖాయం. రెండూ ఆడేస్తే… ఇక శ్రుతికి తిరుగులేదు. బాల‌య్య, చిరంజీవి ఇద్ద‌రూ డాన్సుల్లో టాప్‌. ఈ రెండు సినిమాల్లో మంచి మాస్ పాట‌లు ప‌డ్డాయి. కాబ‌ట్టి… శ్రుతి రెచ్చిపోయి ఉంటుంది. ఈ రెండు సినిమాల్లో హీరోల‌తో రొమాన్సే కాదు.. కడుపుబ్బా న‌వ్వించేలా కామెడీ కూడా చేసింద‌ట‌. ‘వాల్తేరు వీర‌య్య‌’లో చిరంజీవితో ఓ ఫ‌న్నీ ఫైట్ సీన్ ఉంది. ఈ ఫైట్‌… స‌ర‌దా స‌ర‌దాగా సాగిపోతోంద‌ని టాక్‌. ఈ ఫైట్ ని రామ్ ల‌క్ష్మ‌ణ్ మాస్ట‌ర్ కంపోజ్ చేశారు. చిరు కామెడీ టైమింగ్ గురించి ప్ర‌త్యేకించి చెప్పేది ఏముంది? దానికి శ్రుతి తోడైంది. ఇక‌… న‌వ్వులే న‌వ్వులు. అంతే కాదు.. `వీర సింహారెడ్డి`లో శ్రుతితో వీర లెవిల్ లో కామెడీ చేయించార్ట‌. ఆ స‌న్నివేశాల‌న్నీ బాగా న‌వ్విస్తాయ‌ని తెలుస్తోంది. ”క‌మ‌ల్ హాస‌న్‌లో కామెడీ యాంగిల్ ఎలా ఉంటుందో మనందరికి తెలుసు. శ్రుతి కూడా త‌క్కువ చేయ‌లేదు. ఆయ‌న్ని గుర్తు చేసేలా.. ఈ సినిమాలో కామెడీ చేసింది” అంటూ ర‌చ‌యిత బుర్రా సాయిమాధ‌వ్ హింట్ ఇచ్చేశారు. సో… ఈ సంక్రాంతికి శ్రుతిలోని కామెడీ యాంగిల్ బ‌య‌ట‌కు రాబోతోంద‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close