ఐదారుగురు కొనసాగొచ్చు – నాకు చాన్స్ తక్కువే : కొడాలి నాని

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలోని సభ్యులు సీఎం జగన్ మినహా రాజీనామా చేశారు. మొత్తం జగన్‌తో కలిసి ఇరవై ఆరు మంది ఉంటారు. గౌతంరెడ్డి మరణంతో ఒకటి ఖాళీగా ఉంది. జగన్ కాకుండా మరో ఇరవై నాలుగు మంది మంత్రులు ఉన్నారు. వారందరి దగ్గర కేబినెట్ భేటీలో రాజీనామా పత్రాలు తీసుకున్నారు. ముందుగానే లెటర్ ప్యాడ్లు తెచ్చుకోవాలని సమాచారం ఇచ్చారు. ఆ మేరకు కేబినెట్ భేటిలో వారితో రాజీనామా పత్రాలు రాయించి తీసుకున్నారు. వాటిని గవర్నర్‌కు పంపుతారు. కొత్త మంత్రుల జాబితాను రెండు, మూడు రోజుల్లో లీక్ చేయడం లేదా అధికారికంగా విడుదల చేయడం చేసే అవకాశం ఉంది.

మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత పలువురు మంత్రులు మీడియాతో మాట్లాడారు. మంత్రి కొడాలి నాని కొత్త కేబినెట్‌లో ఐదారుగురు కొనసాగవచ్చని ప్రకటించారు. కొత్తకేబినెట్‌లో తాను ఉండే అవకాశం తక్కువ అన్నారు. అయితే ఆ ఐదారుగురు ఎవరన్నదానిపై క్లారిటీలేదు. అందరి దగ్గరా రాజీనామా లేఖలు తీసుకున్నారు. కొనసాగించాలనుకున్న వారి రాజీనామా లేఖలనుపక్కన పెట్టి.. గవర్నర్‌కుపంపితే వారిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఒక వేళ మంత్రులందరి రాజీనామా లేఖలను గవర్నర్‌కు పంపితే..కొత్తగా వారితోనూ ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంటుంది. మొత్తంగా కేబినెట్ వ్యవహారాన్ని వైసీపీ నేతలు ఓ ఈవెంట్‌లా కొనసాగిస్తూండటం వైసీపీ నేతల్లోనూ ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. మీడియాలో ఇతర సమస్యలు ప్రచారం కాకుండా..క ఈ కేబినెట్ గురించి చర్చించుకుంటే చాలన్నట్లుగా ఈ ఈవెంట్ నడుపుతున్నారని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విజ‌య్ పాత లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు తీస్తారా?

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన 'డియ‌ర్ కామ్రేడ్‌', 'ఖుషి' చిత్రాల తాలుకూ క‌మ‌ర్షియ‌ల్ రిజ‌ల్ట్ ఏమిటి? ఈ సినిమాల వ‌ల్ల నిర్మాత‌లు న‌ష్ట‌పోయారా, లాభ‌ప‌డ్డారా? ఈ లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు రాబోతున్నాయి. విజ‌య్...

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close