డ్రగ్స్‌ కేసుతోనే ప్రారంభించిన తమిళిసై !

తెలంగాణ ప్రభుత్వంం అవమానాలకు గురి చేస్తూండటంతో తాడో పేడో తేల్చుకోవాలని డిసైడయిన గవర్నర్ తమిళిసై డ్రగ్స్ కేసుతోనే ప్రారంభించినట్లుగా కనిపిస్తోంది. తెలంగాణలో డ్రగ్స్ చాలా సీరియస్ ఇష్యూలా మారిందని పూర్తి స్థాయి నివేదికను అమిత్ షాకు అందించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో డ్రగ్స్ కేసుల్లో సెలక్టివ్‌గా దాడులు చేస్తున్నారని.. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. డ్రగ్స్ పిల్లలకు చాలా ప్రమాదకరమైనవని.. ఓ తల్లిగా బాధపడుతూ ఈ విషయం చెబుతున్నానన్నారు. అలాగే తెలంగాణలో అవినీతి ఇతర అంశాలను కూడా నివేదికలో గవర్నర్ ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం తెలంగాణలో డ్రగ్స్ కేసు సంచలనంగా మారింది. అదే సమయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ డ్రగ్స్ కేసును విచారణ చేయడానికి ముందుకు వచ్చినా ఆధారాలు ఇవ్వడం లేదు. దీనిపై తెలంగాణ ఉన్నతాధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఈడీ పిటిషన్ కూడా వేసింది. అయినప్పటికీ అధికారులు సాక్ష్యాలు ఇవ్వలేదు. గురువారమే కోర్టు సీఎస్‌తోపాటు ఎక్సైజ్ శాఖ డైరక్టర్‌కు హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఇలాంటి తరుణంలో గవర్నర్ డ్రగ్స్ కేసు గురించి కూడా కేంద్రానికి నివేదిక ఇవ్వడం కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.

ఢిల్లీలో గవర్నర్ చేస్తున్న విమర్శలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. గవర్నర్‌తో తమకు ఎలాంటి పంచాయతీ లేదని ఆయన స్పష్టం చేశారు. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ప్రతిపాదనకు ఆమోదం చెప్పలేదని .. ఇబ్బంది పెడుతున్నారని గవర్నర్ అంటున్నారని.. గత గవర్నర్ నరసింహన్ ఉన్నప్పుడు తమకు ఎప్పుడూ ఇబ్బందులు ఎదురు కాలేదని కేటీఆర్ గుర్తు చేశారు. గవర్నర్ ఏదేదో ఊహించుకుని మాట్లాడుతూంటే తాము ఏం చేయగలమని కేటీఆర్ ప్రశ్నించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close