కోదండరామ్ ఆవేదన సహేతుకమే కానీ…

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత, తెలంగాణా ఉద్యమాలలో కీలక పాత్ర పోషించిన తెలంగాణా జె.ఏ.సి. చైర్మెన్ ప్రొఫెసర్ కోదండరామ్ కి తెరాస ప్రభుత్వం అపూర్వమయిన గౌరవమర్యాదలు అందిస్తుందని అందరూ భావించారు. కానీ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను పులిహోరలో కరివేపాకులాగ తీసి పక్కన పడేశారు. ఈ 22 నెలల కాలంలో కనీసం ఆయనను జ్ఞాపకం చేసుకొన్న దాఖలాలు కూడా లేవు.

అంతటి వాడినే పట్టించుకోని తెరాస ప్రభుత్వం, ఒకప్పుడు తెలంగాణా కోసం పోరాడిన మహేందర్ రెడ్డి అనే ఉద్యమకారుడు రోడ్డు ప్రమాదంలో మరణిస్తే పట్టించుకొంటుందని ఆశించడం అత్యాశే అవుతుంది. మహేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన ప్రొఫెసర్ కోదండరామ్, అనంతరం మీడియాతో మాట్లాడుతూ “తెరాస ప్రభుత్వంలో ఉద్యమకారులకు చోటు లేకుండాపోయిందని, వారికి చోటు కల్పించకపోగా, వారిని అణచివేసిన వారికే పదవులు, అధికారం కట్టబెడుతున్నారని” ఆవేదన వ్యక్తం చేసారు.

ఆయన ఆవేదన సహేతుకమే కానీ ఇపుడు తెరాస ఒకనాటి తెరాస కాదని, కేసీఆర్ ఆనాటి కేసీఆర్ కాదనే చేదు నిజం జీర్ణించుకోక తప్పదు. ఒకప్పుడు తెరాస అంటే తెలంగాణా రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించడానికి సైతం వెనుకాడని వేలాది మంది కార్యకర్తలే గుర్తుకు వచ్చేరు. కానీ అదిప్పుడు దేశముదురు కాంగ్రెస్, తెదేపా నేతలతో నిండిపోయింది. వారిలో ఏనాడు తెలంగాణా కోసం ఉద్యమించని వారు పదవులు, అధికారం అనుభవిస్తున్నారు. అందుకు వారిని తప్పు పట్టలేము. తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ఆలోచనా తీరులో వచ్చిన మార్పు కారణంగానే వారందరూ పార్టీలోకి, ప్రభుత్వంలోకి వచ్చి చేరారు.

ఒకప్పుడు తెలంగాణా సాధనే తన జీవిత ద్యేయం అని పలికే కేసీఆర్ ఇప్పుడు తెలంగాణాలో తెరాసకు ఎదురులేకుండా చేసుకోవడమే ధ్యేయంగా మార్చుకొని ఆ ప్రకారం అన్ని పార్టీల నేతలను తెరాసలో చేర్చుకొంటున్నారు. దానికి ఆయన ఒక అందమయిన పేరు కూడా పెట్టుకొన్నారు. అదే రాజకీయ ఏకీకరణ. దానికి ఒక బలమయిన కారణం కూడా చెప్పుకొన్నారు. అదే ‘బంగారి తెలంగాణా సాధన.’

అయితే తెలంగాణా కోసం తమ సర్వస్వం ధారపోసి పోరాడిన వారితో ప్రభుత్వం ఏర్పాటు చేసుకొంటే బంగారి తెలంగాణాను నిర్మించుకోవడం సాధ్యం కాదా? అంటే నిజానికి వారయితేనే నిండు మనసుతో, నిబద్దతతో బంగారి తెలంగాణా కోసం కృషి చేస్తారని చెప్పవచ్చును. వారికి తెలంగాణా కోసం కష్టపడటం మాత్రమే తెలుసు తప్ప తెరాసకు సవాలు విసురుతున్న ప్రతిపక్ష పార్టీలను నిలువరించడం తెలియదు కనుక కేసీఆర్ వారందరినీ పక్కన పెట్టేసి, తమ పార్టీకి సవాలు విసురుతున్న ప్రతిపక్ష పార్టీల నుండే నేతలను తెరాసలోకి దిగుమతి చేసుకోవడం ప్రారంభించారు. ఆవిధంగా చేయడం వలన ఇక తెలంగాణాలో తెరాసకు సవాలు విసిరేవాళ్ళుండరు..తన అధికారాన్ని ప్రశ్నించేవాళ్ళు అసలే ఉండరు.

అయితే ఈ వ్యూహాలు, ఆలోచనలు అన్నీ బంగారి తెలంగాణా సాధన కోసమేనని ఆయన చెప్పుకొంటుంటారు. రాష్ట్రాభివృద్ధి చేసి తెలంగాణాను దేశంలో అగ్రస్థానంలో నిలపాలనే కేసీఆర్ ఆశయాన్ని శంఖించడానికి లేదు కానీ దాని కోసం ఆయన ఎంచుకొన్న మార్గం, అనుసరిస్తున్న వ్యూహాలే తెలంగాణా కోసం పోరాడినవారు జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం సుస్థిర అధికారం చాలా ముఖ్యమే కానీ అధికారమే పరమావధిగా చేసుకొని ముందుకు సాగుతూ, తెలంగాణా కోసం పోరాడిన వారిని మరిచిపోవడమే పెద్ద తప్పు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close