ఇక కోదండరాం ఎమ్మెల్సీ !

కోదండరాం ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. గవర్నర్ కోటాలో కోదండరాంతో పాటు సియాసత్ ఉర్దూ పత్రిక యజమానికి అమీర్ అలీ ఖాన్ కూడా ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. వీరి పేర్లను సిఫారసు చేసిన వెంటనే గవర్నర్ తమిళిసై ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా ఆమోదించారు. నిజానికి ఈ వ్యవహారంలో కోర్టులో ఉందని.. కోర్టులో వ్యవహారం తేలిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటానని రాజ్ భవన్ ప్రకటన విడుదల చేసింది.

బుధవారం రోజుకోర్టులో సదరు పిటిషన్ పై విచారణ జరిగింది. గవర్నర్ నిర్ణయంపై స్టే ఇవ్వడానికి నిరాకరించడంతో.. కాంగ్రెస్ సర్కార్ సిఫారసు చేసిన పేర్లను గవర్నర్ ఆమోదించారు. గతంలో గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను కేసీఆర్ కేబినెట్ సిఫారసు చేసింది. చాలా రోజులు పెండింగ్ లో పెట్టిన గవర్నర్ .. తర్వాత వారిద్దరికీ అర్హత లేదని స్పష్టం తిరస్కరించింది. అయితే కేసీఆర్ సర్కార్ వేరే వారి పేర్లను సిఫారసు చేయలేదు. ఈ లోపు ఎన్నికలు వచ్చాయి. బీఆర్ఎస్ ఓడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ కు ఇద్దరు ఎమ్మెల్సీలను సిఫారసు చేసే చాన్స్ వచ్చింది. అయితే అదే సమయంలో తిరస్కరణకు గురైన ఇద్దరు బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఇకఈ కేసు తేలదనుకున్నారు.

గవర్నర్ నిర్ణయంపై స్టే ఇవ్వకపోవడంతో గవర్నర్ భర్తీ చేసేశారు. నిజానికి గవర్నర్ కు ఈ విషయంలో ఉన్న అధికారాలు పరిమితమైనవి. పేరుకు గవర్నర్ కోటానే అయినప్పటికీ.. నేరుగా గవర్నర్ ఎమ్మెల్సీల్ని నియమించలేరు. కేబినెట్ సిఫారసు చేసిన వారినే నియమించారు. ఓ సారి సిఫారసు చేసిన వారిని తిరస్కరిస్తే రెండో సారి సిఫారసు చేస్తే అంగీకరించి తీరాల్సి ఉంటుంది. కానీ కేసీఆర్ ఆ పని చేయకపోవడంతో రెండు ఎమ్మెల్సీలు కోల్పోవాల్సి వచ్చినట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close