హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు ఐదు శాతం ఓట్లేనట..!

శత్రువులు ఎక్కడో ఉండరు చెల్లెళ్లు, కూతుళ్ల రూపంలో ఇంట్లోనే ఉంటారంటూ ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. కానీ రాజకీయంగా దాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు .. మరో రకంగా మార్చుకుని వాడుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి శత్రువులు ఎక్కడో ఉండరు.. సొంత పార్టీ నేతల రూపంలోనే ఉంటారు. తాజాగా మరోసారి తెలంగాణ కాంగ్రెస్ కు అదే అనుభవం అయింది. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఐదు శాతం ఓట్లు మాత్రమే వస్తాయని.. ఆ పార్టీకే చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. తాను సర్వే చేయించానని.. అక్కడ ఈటల రాజేందర్‌కు అరవై శాతం ఓట్లు వస్తాయని.. టీఆర్ఎస్‌కు ముఫ్పైశాతం వస్తాయని ఆయన చెప్పుకొచ్చారు.

పీసీసీ చీఫ్ పీఠం ఇవ్వనందుకు.. కోమటిరెడ్డి వెంకటరెడ్డిచేసిన రచ్చ అంతా ఇంతా కాదు. హుజూరాబాద్‌లో కనీసం డిపాజిట్ తెచ్చుకోవాలని ఆయన రేవంత్‌కు సవాల్ చేశారు. దానికి తగ్గట్లుగా అక్కడ డిపాజిట్ రాదని చెప్పడానికి ఆయన సర్వేల అంశాన్ని తెరపైకి తెచ్చారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంత ఘోరంగా ఉన్నా.. ముందుగా.., ఆ పార్టీ నేతలుచెప్పుకోరు. అలా చెప్పుకుంటే.. డ్యామేజ్ అయ్యేది కాంగ్రెస్ పార్టీ ఇమేజే. ఇప్పుడే వెనుకబడిపోయారన్న అభిప్రాయం… ప్రజల్లో ఏర్పడుతుంది . దీని కోసమే కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా రేవంత్ రెడ్డి వర్గీయులు అనుమానిస్తున్నారు.

హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్న పరిస్థితి ఉందని అందరికీ తెలుసు. ఈటల బీజేపీలో చేరడంతో బీజేపీ రేసులోకి వచ్చింది. అయితే.. రేవంత్ పీసీసీ చీఫ్ అయిన తర్వాత అక్కడ ముక్కోణపు పోటీ జరుగుతుందన్న అభిప్రాయం మెల్లగా వినిపించడం ప్రారంభించింది. దళిత వర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి అభిమానం ఉండటం.. రెడ్డి సామాజికవర్గం మొత్తం కాంగ్రెస్‌కు పని చేసే చాన్స్ ఉండటంతో.. ఈ అంచనాలు వేశారు. అయితే కోమటిరెడ్డి ఇప్పుడు.. ఈ ప్లస్ పాయింట్ కాంగ్రెస్ పార్టీకి అందకుండా చేసేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close