రాహుల్ అభ్యర్థిత్వానికి మమతా ఓకే..?

ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఓడించడానికి అందరూ ఏకమవ్వాల్సిన అవసరాన్ని మమతా బెనర్జీ ఎట్టకేలకు గుర్తించినట్లుగా కనిపిస్తోంది. ఇంత కాలం ఆమె.. ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీని ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్‌తో కలిసి పోరాటం చేసే విషయంలో రిజర్వేషన్లను పాటిస్తున్నారు. అవసరం అయినప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీతో కలుస్తున్నారు. దీంతో విపక్షాల మధ్య ఐక్యత లేకుండా పోయింది. అయితే ఇప్పుడు మమతా బెనర్జీ పూర్తి స్థాయిలో మనసు మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. ఢిల్లీలో సోనియా గాంధీతో భేటీ తర్వాత ఆమె.. మాటల్లో మార్పు స్పష్టంగా కనిపించింది. బీజేపీపై పోరాడేందుకు జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నింటికీ సాయం చేయాలనుకుంటున్నాను కానీ నాయకత్వం వహించాలనుకోవడం లేదని ప్రకటించారు.

ఎవరు నేతృత్వం వహించినా నాకేమీ అభ్యంతరం లేదు. ఆ అంశం చర్చకు వచ్చినప్పుడు నిర్ణయిస్తామన్నారు. అయితే తానేమ పట్టుబట్టనని స్పష్టం చేశారు. మమతా బెనర్జీ వ్యూహాత్మకంగానే ఈ వ్యాఖ్యలు చేశారు. అందరి ఆమోదంతోనే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి కాబట్టి.. తనకు అభ్యంతరం లేదని తెలిపారు. శరద్ పవార్‌తో పాటు మరికొంత మంది ప్రాంతీయ పార్టీల నేతలతో ఈ అంశంపై చర్చించిన తర్వాత అధికారికంగా ప్రకటించి.. వచ్చే ఎన్నికలు మోడీ వర్సెస్ రాహుల్ అన్నట్లుగా మార్చే అవకాశం ఉంది.

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొంత కాలంగా కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తున్నారు. విపక్షాలకు.. కూడా.. కాంగ్రెస్ తో కలిసి పోరాడితేనే ప్రయోజనం ఉంటుందని… ధర్డ్ ఫ్రంట్ అనేది సాధ్యం కాదని వివరిస్తున్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి అయితే..తాను కాంగ్రెస్ కోసం పని చేసేందుకు సిద్ధమని ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఈ తురణంలో మమతా బెనర్జీలో మార్పు.. జాతీయ రాజకీయాల్లో కీలక మలుపు కానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close