అప్పు అభివృద్ది : ఒక్క ఏప్రిల్‌లోనే రూ. 20వేల కోట్లు..!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి రుణాలివ్వడానికి ఎవరూ వెనక్కితగ్గడం లేదు. పరిమితికి మించి అప్పులు చేసినట్లుగా కేంద్రం ప్రకటించినా.. అటు కేంద్రమూ భూరి రుణాలిస్తోంది. బ్యాంకులు కూడా ఇటు గవర్నర్‌ను హామీగా పెట్టినా సరే.. “ఎంత కావాలి..?” అనే సింగిల్ డైలాగ్‌ను చెబుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఏడాదిలో ఏపీ సర్కార్ కొంచెం తక్కువగా రూ. ఇరవై వేల కోట్ల అప్పులు చేసిందని… ఈ లెక్కలన్నీ చూసే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్.. తాజా లెక్కలు విడుదల చేసింది. స్పష్టంగా చెప్పుకోవాలంటే.. ఏప్రిల్‌లో ఏపీ ప్రభుత్వం అన్ని మార్గాల ద్వారా చేసిన అప్పు రూ.19,717 కోట్లు. అన్ని మార్గాలు అంటే.. ఆర్బీఐ ద్వారా బాండ్లను వేలం వేయడం.. బ్యాంకుల నుంచి సేకరించడం.. ఆర్థిక సంస్థల నుంచి తీసుకోవడం వంటి వన్నమాట.

బడ్జెట్‌లో ఏపీ ప్రభుత్వం ఏడాది మొత్తం తాము రూ.37వేల కోట్ల కంటే ఎక్కువ అప్పులు చేయబోమని స్పష్టం చేసింది. అంటే.. సగటున.. రూ. మూడు వేల కోట్లు అన్నమాట. కానీ మొదటి నెలలోనే .. మొత్తం ఏడాదిలో చేస్తామని చెప్పిన అప్పుల్లో యాభై శాతానికిపైగా చేసేశారు. ఎవరైనా ఆదాయానికి మించి అప్పులు చేయరు. అలా చేయడం దివాలా కిందకు వస్తుంది. ప్రస్తుతం ఏపీ ఆ పరిస్థితి చేరింది. ఏప్రిల్ నెల మొత్తం.. పన్నులు.. కేంద్ర సాయం ద్వారా అందింది… రూ. 11, 600 కోట్లు. ఇందులో ఏపీకి నికరంగా ఉన్న ఆదాయం రూ. ఏడు వేల ఏడు వందల కోట్లు మాత్రమే. ఈ మాత్రం ఆదాయానికి.. నెలకు రూ. ఇరవై కోట్ల అప్పు చేస్తోంది ఏపీ ప్రభుత్వం.

ఇది ఏప్రిల్ లెక్కలే. మే లెక్కలను ఇంకా విడుదల చేయలేదు. నిజానికి మేలో పెద్దగా అప్పులు దొరకలేదు. అందుకే.. జూన్ ప్రారంభంలో ఉద్యోగులకు జీతాలకు ఇబ్బంది ఎదురయింది. జూన్‌లో ఎలాంటి పరిస్థితి ఉందో ఇంకా స్పష్టత రాలేదు. రుణాల కోసం… వచ్చే డిసెంబర్ – మార్చి మధ్య తీసుకోవాల్సిన రుణాలు ఇప్పుడే తీసుకునేలా పర్మిషన్ ఇవ్వాలన్న విజ్ఞప్తితో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అదే పనిగా ఢిల్లీలో కేంద్ర పెద్దలందర్నీ కలిశారు. వర్కవుట్ అయిందో లేదో.. రేపు ఉద్యోగులకు జీతాలు.. పెన్షన్లు..సామాజిక పెన్షన్లు వంటి వాటికి చెల్లింపుల ద్వారా తెలుస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సజ్జల రాజీనామా చేస్తే ఏమవుతుంది !?

ఏపీలో సలహాదారులకు కూడా కోడ్ వర్తిస్తుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం ప్రభుత్వ సలహాదారు రాజకీయ వ్యవహారాలు మాట్లాడేందుకు వీలు లేదు. అయినా సజ్జల...

మంత్రి బుగ్గన సిబ్బంది బెదిరింపులు…మహిళ సూసైడ్..!?

ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిబ్బంది అత్యుత్సాహం ఓ మహిళా నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి.కనీస మానవత్వం చూపకుండా బెదిరింపులకు దిగడంతో ఓ నిరుపేద మహిళా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కోనసీమ జిల్లా కొత్తపేటకు...

మేనిఫెస్టో మోసాలు : జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ ఏది బ్రో !

చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగ భృతి పథకం పెట్టి.. భృతి ఇచ్చి.. ఇలా భృతి తీసుకునేవాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఎప్పటికప్పుడు ఉద్యోగాలిచ్చేలా వ్యవస్థను సృష్టిస్తే.. జగన్ ెడ్డి ఏపీకి...

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close