అమరావతి మహిళల్ని అత్యంత ఘోరంగా కించపరిచిన వ్యవహారంలో తమను జగన్, భారతి ఏమీ అనలేదని సాక్షి టీవీ లైవ్ షో నడిపే కొమ్మినేని వెంకటేశ్వరరావు చెప్పుకొచ్చారు. ఆదివారం ఉదయం కూడా ఆయన షోలోకి వచ్చారు. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. సాక్షి టీవీ మహిళలకు అత్యున్నత గౌరవం ఇస్తుందని సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. తమ యజమాన్యం కూడా అలాంటి విలువలు పాటిస్తుందన్నారు.
మరి అలాంటి విలువలు పాటించే వారు అయితే జగన్ , భారతి ఇద్దరూ కలిసి అటు ఆ కృష్ణంరాజును, ఇటు ఈ కొమ్మినేని మరోసారి సాక్షి టీవీలో కనిపించకుండా గెంటేసి ఉండేవారు. సమాజానికి తమ విలువలపై స్పష్టమైన సంకేతాన్ని పంపి ఉండేవారు కాదు. స్వయంగా మహిళ అయిన భారతి రెడ్డి నడుపుతున్న చానల్ లో అలాంటి ఘోరమైన , మహిళా లోకాన్ని కించ పరిచే మాట్లాడినా అటు జగన్ కానీ.. ఇటు భారతి కానీ ఏమీ అనలేదని కొమ్మినేని చెబుతున్నారంటే వారి విలువలేంటో.. చేతల్లో చూపిస్తున్నట్లుగా అవుతుంది.
జర్నలిజం పేరుతో వారు చేస్తున్నదేమిటో కానీ … అటు కొమ్మినేనితో పాటు ఇటు సాక్షి మీడియా, జర్నలిస్టు కృష్ణంరాజుపైనా చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ విషయం తెలుసు కాబట్టే…. సాక్షి. టీవీకి ఏం సంబంధంలేదని అది కృష్ణం రాజు వ్యాఖ్యలని కవర్ చేసుకున్నారు. కానీ.. చట్ట ప్రకారం ఎవరి బాధ్యత ఎంత ఉందో.. ఎవరు అమరావతి మహిళల్ని కించపరిచారో వారి లెక్కలు చట్టపరంగానే సరి చేసే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తున్నాయి.