‘శంకరాభరణం’లో శ్రీను వైట్లపై పంచ్‌లు: కసి తీర్చుకున్న కోన

హైదరాబాద్: ఎవరి మీదైనా కోపం ఉంటే తన తదుపరి చిత్రంలో వారిపై సెటైర్ పెట్టి శ్రీను వైట్ల కసి తీర్చుకోవటం తెలిసిందే. సంగీత దర్శకుడు చక్రిమీద, ప్రకాష్‌రాజ్‌మీద, రాంగోపాల్ వర్మ మీద, బాలకృష్ణమీద ఆయన తన సినిమాలలో వేసిన సెటైర్లు అందరికీ తెలిసినవే. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. శ్రీను వైట్లపైనే పంచ్‌లు పడ్డాయి. రచయిత కోన వెంకట్ తన తాజా చిత్రం శంకరాభరణంలో ఎడా పెడా పంచ్‌లు వేసి శ్రీను వైట్లపై కసి తీర్చుకున్నారు.

శంకరాభరణంలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఫేమ్ పృథ్వి పాత్రతో – “ఆవును పిండితే పాలిస్తుంది, ఆర్టిస్టును పిండితే పర్ఫార్మెన్స్ ఇస్తాడు, మా దర్శకులం ఆర్టిస్టులనుంచి నటనను పిండుకుంటాం. ఆ పనిలో ఇంట్లో పెళ్ళాలను కూడా మర్చిపోతాం” అనే డైలాగ్ చెప్పించారు. శ్రీను వైట్లకు, ఆయన భార్య రూపకు ఇటీవల విభేదాలు రావటం, భర్త కొడుతున్నాడంటూ ఆమె పోలీస్ కేసు పెట్టటం తెలిసిందే. దానిమీదే ఈ సెటైర్ వేసినట్లు కనబడుతోంది. మరోవైపు నటుడి గిరి ధరించిన పాత్రద్వారా మరో పంచ్ వేయించారు. గిరి పాత్ర బన్నీ వేసుకుని టీలు అమ్ముకుంటూ ఉంటాడు. ఆ పాత్రను, “డైరెక్టర్ గారూ! ఎంతో మంది స్టార్‌లకు హిట్‌లు ఇచ్చిన మీరేంటి ఇలా టీలు అమ్ముకుంటున్నారు” అని అడిగితే, “టైమ్ బాగోకపోతే జాకీ చాన్ అయినా కీ చైన్‌లు అమ్ముకోవాల్సిందే” అని గిరి పాత్ర అంటుంది. శ్రీను వైట్ల టైమ్ ఇప్పుడు బాగోకపోవటంపై ఈ పంచ్ వేసినట్లు కనబడుతోంది. మొత్తం మీద టిట్ ఫర్ ట్యాట్ అయింది.

శ్రీను వైట్లకు, కోన వెంకట్‌కు మధ్య దూకుడు చిత్రం తర్వాత విభేదాలు తలెత్తాయి. అయితే రాంచరణ్ బ్రూస్‌లీ చిత్రంకోసం వీళ్ళను కలిపారు. అయితే ఆ చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దానికి కారణం తాను రాసిచ్చిన సీన్లను ఇష్టమొచ్చినట్లు మార్చటమేనని కోన మండిపడ్డారు. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, బ్రూస్‌లీ విషయంలో శ్రీనువైట్లపై ఎమోషనల్ అయిన మాట నిజమేనని, అయితే రు.10 కోట్ల పరువు నష్టం దావా వేయాలని యోచిస్తున్నట్లు వచ్చిన వార్తలు అబద్ధమని అన్నారు. ఆ గొడవలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. అయితే కసినంతా ఇలా సినిమా తీర్చుకున్నట్లు ఇవాళ బయటపడింది. మరోవైపు శంకరాభరణం చిత్రంలో తనపై వేసిన సెటైర్‌లపై శ్రీను వైట్ల ఫిర్యాదు చేసినట్లు వార్తలొస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close