సంచలనం సృష్టించిన లారెన్స్: కోటి రూపాయల విరాళం

హైదరాబాద్: చెన్నై వరద బాధితులకు అల్లు అర్జున్, సూర్య లాంటి వారు తప్పితే మిగిలిన సినీ ప్రముఖులు 5-10 లక్షలను మాత్రమే ఇస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్, సూర్య మాత్రం రు.25 లక్షలు ప్రకటించారు. అయితే వీరందరినీ తలదన్నేలా కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు లారెన్స్ కోటి రూపాయల విరాళం ప్రకటించి సంచలనం సృష్టించారు. అట్టడుగు స్థాయినుంచి వచ్చిన లారెన్స్ కొరియోగ్రాఫర్‍‌గా కెరీర్‌ను ప్రారంభించి నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా మారారు. దర్శకుడిగా స్టైల్, మాస్, డాన్, కాంచన,రెబల్ వంటి చిత్రాలను రూపొందించారు. గతంలోకూడా ఎన్నో సంస్థలకు విరాళాలు అందించారు.

మరోవైపు సినీ నటులు ఇస్తున్న విరాళాలపై దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్‌లో సెటైర్లు విసిరారు. వందల వందల కోట్లున్న సూపర్ స్టార్‌లు వేల వేల కోట్లు నష్టపోయిన చెన్నై నగరవాసులకు ఐదు-పది లక్షలు బిచ్చమేస్తున్నారని ఎద్దేవా చేశారు. “అయ్యబాబోయ్, సూపర్ స్టార్‌లు 10 లక్షలు, 5 లక్షలు ఇస్తే అంత డబ్బు ఏమి చేసుకోవాలో తెలియక చెన్నై ప్రజలు మూర్ఛ పోతారు. ఇవ్వకపోవటమే బెటర్” అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే, తెలుగు నటులలో అల్లు అర్జున్ రు.25 లక్షలు, ప్రభాస్ రు.15 లక్షలు, మహేష్, ఎన్‌టీఆర్ రు.10 లక్షలు ఇస్తుంటే తమిళ నటులలో ఒక్క రజనీకాంత్ తప్పితే మరెవరూ రు.5 లక్షలకి మించి ఇవ్వకపోవటానికి ఒక విచిత్రమైన వాదన బయటకొచ్చింది. అక్కడ తమిళ ఇండస్ట్రీలో రజనీకాంత్ అంటే మిగిలిన నటీనటులందరికీ ‘సిగ్గుతో కూడిన భయం వలన వచ్చిన గౌరవం’ లాంటిది ఒకటుంటుంది. దానితో రజనీకాంత్ కంటే ఎక్కువ ఇస్తే ఆయనను అవమానించినట్లవుతుందనే ఉద్దేశ్యంతో రు.5 లక్షలకు మించి ఎవరూ ఇవ్వటంలేదు. ఆ విధంగా చెన్నై వరద బాధితులకు రజనీ ఎఫెక్ట్ తగిలింది. ఇంతా చేసి రజనీకాంత్ ఇచ్చింది రు. 10 లక్షలు!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close