ఆస్పత్రిలో చేరిన కేటీఆర్, సంతోష్..!

కరోనా పాజిటివ్‌గా తేలి హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్‌లు ఆస్పత్రిలో చేరినట్లుగా తెలుస్తోంది. మొదట పెద్దగా లక్షణాలు లేని స్థితిలో … పాజిటివ్‌గా తేలినప్పటికీ.. తర్వాత సింప్టమ్స్ పెరగడం… ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో.. వారిని వైద్యులు ఆస్పత్రికి రిఫర్ చేసినట్లుగా భావిస్తున్నారు. ఎంపీ సంతోష్.. నిన్నామొన్నటి వరకూ కేసీఆర్‌తో పాటు ఫాంహౌస్‌లోనే ఉన్నారు. కేటీఆర్. కూడా అక్కడే వైద్యుల పర్యవేక్షణలో అక్కడే ఉన్నప్పటికీ.. పరిస్థితి కాస్తంత ఇబ్బందికరంగా మారింది. మరో వైపు కేసీఆర్‌కు ఎలాంటి లక్షణాలు లేవని వైద్యులు చెబుతున్నారు.

అయితే.. ఆర్టీపీసీఆర్ టెస్టులో మిశ్రమ ఫలితాలు రావడంతో ఆయన అసోలేషన్‌లోనే ఉన్నారు. రెండు, మూడు రోజుల్లోనే టెస్టులు నిర్వహించే అవకాశం ఉంది. కరోనా వైరస్ తగ్గితే తగ్గుతుంది.. లేకపోతే.. బాడీలో బలహీనంగా ఉన్న వ్యవస్థపై దాడి చేసి.. ఆరోగ్యపరిస్థితిని దిగజార్చుతోంది. అందుకే వైద్యులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో… వ్యక్తిగత వైద్యులు.. సంతోష్, కేటీఆర్‌లను ముందు జాగ్రత్తగా ఆస్పత్రికి రిఫర్ చేసినట్లుగా తెలుస్తోంది.

తెలంగాణలో పలువురు రాజకీయ నేతలు కరోనా బారిన పడ్డారు. మోత్కుపల్లి నర్సింహులు పరిస్థితి సీరియస్ అయింది. అయితే ఆయన కోలుకున్నారు. డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లారు. మరికొంత మంది మంత్రులు కూడా కరోనా బారిన పడ్డారు. అందరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని చెబుతున్నారు. కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అధికార పార్టీ నేతలు.. తమ క్యాడర్‌కు అదే పనిగా సూచిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ ఇద్దరు మంత్రులతో రేవంత్ కు గ్యాప్ పెరుగుతుందా..?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా నిర్వహించిన సమీక్ష సమావేశం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. సంబంధిత మంత్రులు లేకుండా రేవంత్ సమీక్ష నిర్వహించి ఆదేశాలు జారీ చేయడం విమర్శలకు తావిస్తోంది. బుధవారం సచివాలయంలో వ్యవసాయ...

బీఆర్ఎస్ దీన స్థితికి ఇది మరో సాక్ష్యం !

నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కసరత్తు కోసం బీఆర్ఎస్ చేపట్టిన సమావేశానికి పట్టు మని నలభై మంది నేతలు రాకపోవడం ఆ పార్టీ దుస్థితిని తెలియచేస్తోంది. బీజేపీ...

బీజేపీకి దొరికిన పీవోకే అస్త్రం !

బీజేపీ గట్టి పోటీ ఎదుర్కొంటోందని ప్రచారం జరుగుతున్న సమయంలో రిజర్వేషన్ల రద్దు పై ప్రజల్లో జరిగిన చర్చ ఆ పార్టీని సమస్యల్లోకి నెట్టింది. చచ్చినా రిజర్వేషన్లు రద్దు చేయబోమని ప్రజల్ని బతిమాలుకోవాల్సి వచ్చింది....

రేవంత్ రాజీనామా…? త్వరలో కొత్త బాస్?

లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త పీసీసీ అద్యక్షుడి నియామకం ఉంటుందని హైకమాండ్ ఇప్పటికే ప్రకటించడంతో పార్టీ ఆ దిశగా కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. జూన్ నెలాఖరులో లోకల్ బాడీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close