డ్రగ్స్ టెస్టుకు సిద్ధమన్న కేటీఆర్ !

రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను తెలంగాణ మంత్రి కేటీఆర్ సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో డ్రగ్స్ కేసుపై రేవంత్ రెడ్డి పలు ఆరోపణలు చేశారు. ఎక్కువగా కేటీఆర్‌ను టార్గెట్ చేసే చేశారు కానీ ఎక్కడా ఆయన పేరు చెప్పలేదు. అయితే శనివారం మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడిన కేటీఆర్ రేవంత్ రెడ్డి తనపైనే విమర్శలు చేస్తున్నారని ఫిక్సయి.. డ్రగ్స్ టెస్టుకు తాను సిద్ధమని ప్రకటించారు. ఎవడో పిచ్చోడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కి లేఖ ఇచ్చాడని మండిపడ్డారు. తనకు డ్రగ్స్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. కావాలంటే బ్లడ్ శాంపిల్స్, వెంట్రుకలు, అవసరమైన ఇతర శాంపిల్స్ ఇవ్వడానికి నేను సిద్ధమేనని స్పష్టం చేశారు.

అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా అందుకు సిద్ధపడాలని చాలెంజ్ చేశారు. ఇక నుంచి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కేసులు పెడుతామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌పై నోరు పారేసుకుంటే చూస్తు ఊరుకునేది లేదన్నారు. అవసరమైతే రాజద్రోహం కేసులు కూడా పెడతామన్నారు. ఒకప్పుడు సున్నాలు వేసిన వ్యక్తి.. ఇవ్వాళ కన్నాలు వేస్తున్నారని రేవంత్ రెడ్డిపై సెటైర్ వేశారు.

అదే సమయంలో శశిథరూర్‌ను రేవంత్ రెడ్డి గాడిద అనడంపైనా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు గాడిదలు అయితే.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరి అడ్డగాడిదా? అని ప్రశ్నించారు. తెలంగాణకు నిజమైన ముక్తి రాష్ట్రం ఏర్పడటంతోనే జరిగిందని తెలిపారు. బీజేపీకి సాయుధ పోరాటం గురించి మాట్లాడే హక్కు లేదని, ఆనాడు సాయుధ పోరాటం చేసింది కమ్యునిస్టులేనని కేటీఆర్ గుర్తుచేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close