తృణమూల్‌లోకి బీజేపీ సిట్టింగ్ ఎంపీలు కూడా జంప్!

బెంగాల్ బీజేపీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఓ వైపు వలస వచ్చిన నేతలంతా వరుస కట్టి బయటకు పోతూంటే… ముందు నుంచీ ఉన్న నేతలు కూడా.. అదే బాట పడుతున్నారు. నిన్నగాక మొన్న కేంద్ర మంత్రి పదవిని పోగొట్టుకున్న బాలీవుడ్ సింగర్ బాబుల్ సుప్రియో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఇటీవలే ఆయన బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే ఆయన తాను ఏ ఇతర పార్టీలోనూ చేరడం లేదని సామాజిక సేవ దిశగా వెళ్తున్నానని ప్రకటించారు. మొదట ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించిన ఆయన తర్వాతపదవికి రాజీనామా చేయబోనన్నారు.

బాలీవుడ్‌లో హిట్ సాంగ్స్ సింగల్‌గా బాబుల్ సుప్రియోకు మంచిపేరు ఉంది. బెంగాల్‌లో ఎలాంటి క్రేజ్ లేనప్పుడు… క్రేజ్ ఉన్న అభ్యర్థుల కోసం బీజేపీ చూస్తున్నప్పుడు ఆయనకు సుప్రియో కనిపించారు. ఆయన కూడా అంగీకరించడంతో అసన్ సోల్ అనే లోక్ సభ నియోజకవర్గం టిక్కెట్ ఇచ్చారు. అక్కడ పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత రెండో సారి కూడా… 2019లో గెలిచారు. ఆయనకు కేంద్ర మంత్రి పదవి కూడా ఇచ్చారు. అయితే… అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరాలన్న లక్ష్యంతో ఆయనను ఎమ్మెల్యేగా బరిలో నిలిపారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఎమ్మెల్యేగా ఓడిపోయారు.

దాంతో.. బీజేపీ హైకమాండ్ ఆయన కేంద్రమంత్రి పదవిని పీకేసి.. బెంగాల్‌లో ఇతరులకు ఇచ్చింది. అదే సమయంలో బెంగాల్ బీజేపీ అగ్రనేతలకు సుప్రియోకు పొసగడం లేదు. చివరికి ఆయన తాను పార్టీలో ఉండటం దండగనుకున్నారు. రాజీనామా చేసేశారు. ఇప్పుడు తృణమూల్‌లో చేరారు. అసలే కష్టాల్లో ఉన్న బీజేపీకి సిట్టింగ్ ఎంపీ తృణమూల్‌లో చేరడం షాక్ లాంటిదే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బర్రెలక్క పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. తన...

హిందూపురం నుంచి పరిపూర్ణనంద పోటీ – బాలకృష్ణే కారణమా..?

హిందూపురం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణనంద స్వామి.లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించి అనూహ్యంగా అసెంబ్లీకి పోటీ చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ తరఫున...

పవన్‌ను ఆశీర్వదించిన పిఠాపురం !

పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ ర్యాలీ జరిగింది. పవన్ తాను అద్దెకు తీసుకున్న చేబ్రోలులోని ఇంటి నుంచి నామినేషన్ వేసేందుకు ఆర్వో ఆఫీసుకు వచ్చేందుకు ఐదు గంటలకుపైగా సమయం...

సూరత్ తరహాలో సికింద్రాబాద్ చేజారుతుందా..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , చేవెళ్లలో ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మల్కాజ్ గిరి, చేవెళ్లలో అభ్యర్థుల ప్రచారంలో దూకుడుగా సాగుతున్నా సికింద్రాబాద్ లో మాత్రం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close