తరుణ్, పూరిల శాంపిల్స్‌లో డ్రగ్స్ లేవట..! అందరివీ లేనట్లేగా ?

నాలుగేళ్ల కిందట తీసుకున్న శాంపిల్స్‌ టెస్టుల ఫలితాలను తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఇప్పుడు కోర్టుకు సమర్పించింది. తరుణ్ , పూరి జగన్నాథ్‌ల నుంచి సేకరించిన గోళ్లు, వెంట్రుకలు, బ్లడ్ శాంపిల్స్‌లోని 2017లోనే ఎఫ్ఎస్ఎల్‌ ల్యాబ్‌కు పంపారు. తర్వాత ఆ కేసు మరుగున పడిపోయింది. ఇప్పుడు ఈడీ విచారణ ప్రారంభించడంతో మళ్లీ తెరపైకి తెచ్చారో లేకపోతే ఎందుకైనా మంచిదని తారలందరికీ క్లీన్ చిట్ ప్రకటించేద్దామని అనుకుంటున్నారో కానీ.. కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. అందులో ఎఫ్ఎస్ఎల్ నుంచి వచ్చిన రిపోర్ట్.. ఎఫ్ఎస్ఎల్ ఉన్నతాధికారి వాంగ్మూలాలను కూడా కలిపి కోర్టుకు సమర్పించారు.

ఈ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న రంగారెడ్డి జిల్లాలో కెల్విన్‌ను డిసెంబరు 9న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. 2017లో తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించింది. సినీ ప్రముఖులందర్నీ వరుసగా పిలిచి పోలీసులు విచారణ దాదాపుగా అందరి దగ్గర్నుంచి గోళ్లు, వెంట్రుకలు తీసుకున్నారు. 2017 డిసెంబర్ నుంచి చార్జిషీట్లు వేయబోతున్నారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత 2018 జూలైలో.. నలుగురు సినీ సెలబ్రిటీలపై ఆధారాలు దొరికాయని.. వారి గోళ్లు, వెంట్రుకల్లో డ్రగ్స్ ఆనవాళ్లు దొరికాయన్న ప్రచరం జరిగింది. చివరికి 2019 మేలో చార్జిషీట్ దాఖలు చేశారు. అందులో సినీ తారల పేర్లు ఎవరివీ లేవు.

ఇప్పటికే దాఖలు చేసిన చార్జిషీట్లలోనూ ఎవరి పేర్లు లేవు. ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నట్లుగా కూడా వివరాలు లేవు. అంటే అందరికీ క్లీన్ చిట్ ఇచ్చినట్లయింది. ఎక్సైజ్ శాఖ దాఖలు చేసిన చార్జిషీట్ల ఆధారంగానే ఎన్‌ఫోర్స్‌మెంట్ తాజాగా నోటీసులు జారీ చేసి ప్రశ్నిస్తోంది. ఈడీ దూకుడు నేపధ్యంలో ఎక్సైజ్ శాఖ క్లీన్ చిట్ ఆసక్తి రేపుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close