అనధికార కేబినెట్ భేటీని నిర్వహించేసిన కేటీఆర్..!

తెలంగాణ సర్కార్‌లో నెంబర్ టూగా ఉంటూ.. సీఎం రేంజ్ పవర్స్ తో పాటు విధులు కూడా నిర్వహిస్తున్న అనధికారికంగా కేబినెట్ భేటీ కూడా నిర్వహించేశారు. ప్రాక్టీస్ కోసం అన్నట్లుగా జరిగిన ఈ కేబినెట్ భేటీ.. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీకి ఏ మాత్రం తీసిపోలేదు. మంత్రులందరూ హాజరయ్యారు. చీఫ్ సెక్రటరీ సోమేష్ సహా ఉన్నతాధికారులు అందరూ వచ్చారు. కేటీఆర్ ఈ సమావేశానికి నేతృత్వం వహించారు. ముఖ్యమంత్రి మాత్రమే కేబినెట్ భేటీ నిర్వహించాలి కాబట్టి.. ఈ సమావేశానికి కేబినెట్ సబ్ కమిటీ సమావేశంగా పేరు పెట్టారు.

సాధారణంగా ప్రగతి భవన్‌కు మంత్రులు అందరూ ఒకే సారి ఎప్పుడూ రారు. కేబినెట్ భేటీ జరిగినప్పుడు మాత్రమే వస్తారు. కానీ బుధవారం వచ్చారు. ఫుడ్ ప్రాసెసింగ్,లాజిస్టిక్స్ పాలసీ కోసం సమావేశమవుతున్నట్టు మంత్రులకు.. ప్రగతి భవన్ నుంచి పిలుపు వెళ్లింది. మంత్రులందరితో కేటీఆర్ రెండు పూటలా సమావేశమయ్యారు. అధికారికంగా కేబినెట్ భేటీ కాదు కానీ.. ఆ తరహాలోనే సాగింది. కేటీఆర్ పట్టాభిషేకం కోసం.. కేబినెట్ భేటీని నిర్వహించే ప్రాక్టీస్ కూడా..కేసీఆర్ చేయిస్తున్నారేమోనన్న చర్చ.. టీఆర్ఎస్‌లోనే కాదు.. విపక్షాల్లో కూడా ప్రారంభమయింది.

కేసీఆర్ ఉద్దేశ్య పూర్వకంగానే ఈ భేటీ ఏర్పాటు చేసి అధికారులకు, ప్రభుత్వ వర్గాలకు కేటీఆర్ పట్టాభిషేకంపై సంకేతమిచ్చారని అంటున్నారు. ఇప్పటికే పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ తో నంబర్ టూ గా ఉండగా, ప్రభుత్వంలోనూ నంబర్ టూ అని తేల్చేశారంటున్నారు. ఈభేటీ తర్వాత మళ్ళీ కేటీఆర్ సీఎం అన్న ప్రచారం ఊపందుకునే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రి బుగ్గన సిబ్బంది బెదిరింపులు…మహిళ సూసైడ్..!?

ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిబ్బంది అత్యుత్సాహం ఓ మహిళా నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి.కనీస మానవత్వం చూపకుండా బెదిరింపులకు దిగడంతో ఓ నిరుపేద మహిళా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కోనసీమ జిల్లా కొత్తపేటకు...

మేనిఫెస్టో మోసాలు : జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ ఏది బ్రో !

చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగ భృతి పథకం పెట్టి.. భృతి ఇచ్చి.. ఇలా భృతి తీసుకునేవాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఎప్పటికప్పుడు ఉద్యోగాలిచ్చేలా వ్యవస్థను సృష్టిస్తే.. జగన్ ెడ్డి ఏపీకి...

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close