మోడీ తెలంగాణా గడ్డ మీద అడుగుపెట్టేదెప్పుడో..ప్చ్!

కడవంత గుమ్మడి కాయ కూడా కత్తిపీటకు లోకువే అన్నట్లు దేశాన్ని విమానంలో కూర్చొని ఏలుతున్న ప్రధాని నరేంద్ర మోడి అంటే కొత్తగా రాజకీయాలలోకి వచ్చీరాగానే బీహార్ ఉపముఖ్యమంత్రి కూడా అయిపోయిన తేజస్వి ప్రసాద్ కూడా లోకువయిపోయారు. ఆయన తన బట్టలు ఉతికించుకోనేందుకే అపుడప్పుడు భారత్ వస్తుంటారని ఎద్దేవా చేసారు. కాదు..కాదు..తన కుర్చీకి ఎవరు ఎసరు పెట్టకుండా చూసుకోవడానికే అపుడప్పుడు ఇండియా వస్తుంటారని ప్రతిపక్షాలు జోకులు వేసుకొంటున్నాయి.

తెలంగాణా ఐటి మరియు పంచాయితీరాజ్ మంత్రి కె. తారక రామారావు కూడా మోడీ విదేశీ యాత్రల గురించి చిన్న పంచ్ డైలాగ్ కొట్టారు. “ఆయనకీ ఎప్పుడూ విదేశాలలో తిరగడానికే సరిపోతుంది. ఇక కొత్తగా ఏర్పడిన మా తెలంగాణా రాష్ట్రానికి టైం ఎక్కడుంది? తెలంగాణా రాష్ట్రం ఏర్పడి ఇప్పటికి 18 నెలలు గడిచిపోయాయి కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా ప్రధాని నరేంద్ర మోడి తెలంగాణా రావలనుకోలేదు. ఆయనకి తెలంగాణా రాష్ట్రంపై ఎంత ప్రేమ ఉందో అర్ధం చేసుకోవడానికి ఇది చాలు,” అని అన్నారు.

మోడీ తెలంగాణా రాష్ట్రానికి రాకపోవడం, విదేశాలలో యాత్రలు చేస్తుండటం నూటికి నూరుపాళ్ళు నిజమే. కానీ మోడీ దేశంలో ఏ రాష్ట్రాలను పర్యటించడం లేదనే మాట మాత్రం వాస్తవం కాదు. ఆయన ఎన్నికలు జరిగే రాష్ట్రాన్ని ఆరు నెలల ముందు నుంచి ఎప్పుడూ పర్యటిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తెలంగాణాలో ప్రస్తుతం జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు తప్ప పెద్ద ఎన్నికలు ఏవీ లేవు. జి.హెచ్.ఎం.సి. ఎన్నికలకి కూడా ఆయన వచ్చి ప్రచారం చేయవలసిన అవసరం లేదు కనుక ప్రస్తుతం విదేశాలను చుట్టబెట్టేస్తున్నారు. మధ్యలో వీలయితే కేసీఆర్ చేస్తున్న ఆయుత చండీ యాగానికి వస్తారేమో వేచి చూడకుండా కె. తారక రామారావు తొందరపడటం ఎందుకు? ఒకవేళ రాకపోయినా 2019లో ఎన్నికల ప్రచారానికి తప్పకుండా వస్తారని గ్యారంటీగా చెప్పవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close