విడిపోవడం ఏపీకి మంచిదైందట !

`మరక మంచిదే’ అన్నట్లుంది తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్న ధోరణి. సమైక్య రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు చాలా మంచి జరిగిందని కేటీఆర్ గారి ఉవాచ. ఇంతకీ ఆయనగారి లాజిక్కేమిటంటే, సమైక్య రాష్ట్రం విడిపోబట్టే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి ఉరకలేస్తున్నదట. ఏపీ ముఖ్యమంత్రి అటు అమరావతికి, ఇటు పరిశ్రమల స్థాపనకు తీవ్రస్థాయిలో చేస్తున్న కృషిని దృష్టిలో ఉంచుకుని బహుశా కేటీఆర్ అలా మాట్లాడి ఉండవచ్చు. అయితే ఇప్పుడు ఆ విషయాన్ని మీడియా ముందు పదేపదే చెప్పడంలోని అంతరార్థం మాత్రం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలే.

హైదరాబాద్ లోని సీమాంధ్ర వాసులు తెలంగాణ ఉద్యమం సమయంలో అనేక రకాలుగా మాటలు పడ్డారు. తెలంగాణ నేతల నుంచేకాదు, ప్రజల నుంచి కూడా ఛీత్కారాలకు గురయ్యారు. ఆ బాధాకరమైన సంఘటనలను హైదరాబాద్ లోని సీమాంధ్ర పౌరులు మరచిపోలేదు. ఆ గాయాలకు ఇప్పుడు కేటీఆర్ ముందు రాయడానికి సిద్ధమయ్యారు. హైదరాబాద్ లోని ఆంధ్రా ఓటర్లకు గాలంవేయడమే ఆయన ప్రధానోద్దేశం. ఒక టివీలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో `ఏదో భావోద్వేగాలతో ఆనాడు అలా అన్నాం. ఇప్పుడు అందరూ మాకు కావాల్సినవారే..’ అంటూ స్నేహ హస్తం చాస్తున్నారు. ఎన్నో రకాలుగా మాటలుపడిన హైదరాబాద్ ఆంధ్రులు వాటన్నింటినీ మరచిపోయి తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన తెరాసకు ఓట్లు వేస్తారా అన్నది అసలు ప్రశ్న. ఆనాడు రెచ్చగొట్టే రీతిలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తెరాస నేతలు చాలా తేలిగ్గా వెనక్కి తీసుకుంటున్నామని చెబుతున్నా, బాధితులు ఎలా స్పందిస్తారన్నది అనుమానమే.

ఇదిఇలా ఉండగా, కేటీఆర్ వారసత్వ రాజకీయాల గురించి కూడా మాట్లాడారు. మొదటిసారిగా రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ఈ వారసత్వమన్నది ఎంట్రీ పాస్ గా పనిజేస్తుందేతప్ప, ఆ తర్వాత మాత్రం ఎవరికివారు ప్రజాభిమానంతోనే ముందుకు వెళ్ళాలని కేటీఆర్ చెప్పుకొచ్చారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ వంద సీట్లు గెల్చుకోవడం ఖాయమనీ, అలా కాకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటున్నారు కేటీఆర్. కాగా, రెండో స్థానంలో మజ్లీస్ ఉంటుందని చెబుతున్నారు. కాంగ్రెస్ కొట్టుకుపోవడం ఖాయమనీ, తెలుగుదేశం- బిజెపీ పొత్తు రాణించదని ఆయన జోశ్యం చెబుతున్నారు.

మొత్తానికి నిజాయితీగా మాట్లాడతారన్న పేరుదక్కించుకున్న కేటీఆర్ హైదరాబాద్ లోని సీమాంధ్రులను కలుపుకుపోయేందుకు చాలా ఫ్రెండ్లీగా పావులుకదుపుతున్నారనే చెప్పాలి.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close