పరిశ్రమల కోసం కేటీఆర్ స్పీడ్..!

తెలంగాణలో అద్భుతమైన పారిశ్రామిక విధానం ఉందని.. అక్కడి ప్రభుత్వం కూడా ఫ్రెండ్లీగా ఉందని.. కేరళ రాష్ట్రంలో ఆ రాష్ట్ర మీడియాతో కిటెక్స్ అనే కంపెనీ అధినేత ప్రశంసలు గుప్పించారు. తాము అక్కడే పెట్టుబడులు పెట్టబోతున్నామని కూడా ప్రకటించారు. నిజానికి ఈ కిటెక్స్ కేరళలో పెట్టుబడులు పెట్టాలనుకుంది. కానీ అక్కడి రాజకీయ పార్టీలు ఆరోపణలు చేయడంతో మనస్థాపం చెందింది. దీంతో అసలు పెట్టుబడుల ప్రతిపాదన ఉపసంహరించుకోవాలనుకున్నారు కానీ… ఆ అవకాశాన్ని తెలంగాణ అందిపుచ్చుకుంది. విషయం తెలిసిన కేటీఆర్ వేగంగా స్పందించడంతో ఆ పరిశ్రమ తెలంగాణకు చేరింది.

కిటెక్స్ పరిశ్రమ ప్రధానంగా టెక్స్‌టైల్స్ రంగంలో ఉంది. వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్క్‌ను అభివృద్ధి చేయాలనుకుంటున్న తెలంగాణ సర్కార్… ఈ పరిశ్రమ వస్తే…మంచి ఊపు వస్తుందని డిసైడయ్యారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉంటుందని చెప్పి.. కేటీఆర్ ఆ పరిశ్రమ ప్రతినిధుల్ని మొదటగా పర్యటనకు ఒప్పించారు. వారి కోసం ప్రత్యేక విమానం పంపించారు. దీంతోవారు వచ్చేందుకు అంగీకరించారు. మూడు రోజుల క్రితం.. కిటెక్స్ బృందం తెలంగాణకు వచ్చింది. అక్కడ వారికి కేటీఆర్‌నే స్వయంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తర్వాత వారిని ప్రత్యేక హెలికాఫ్టర్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు తీసుకెళ్లారు.

పర్యటన ముగిసినతర్వాత కంపెనీ ప్రతినిధుల్ని నేరుగా ప్రగతి భవన్‌కే తీసుకెళ్లారు. విందు ఇచ్చారు. చివరికి ఎలా అయినా.. పరిశ్రమ పెట్టేందుకు అంగీకరింపచేశారు. వెయ్యి కోట్ల పెట్టుబడితో.. దాదాపుగా నాలుగువేల ఉద్యోగాలు కల్పించనున్నారు. గతంలో ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు… రెండు ప్రభుత్వాలూ ఇలా హోరాహోరీగా పరిశ్రమల కోసం తలపడేవి. హీరో పరిశ్రమ మొదట తెలంగాణకే వెళ్లింది. చంద్రబాబు ఏపీకి తీసుకెళ్లారు. కానీ ఇప్పుడు.. అలాంటి పోటీ తత్వం.. ఏపీ నుంచి లేకపోవడంతో తెలంగాణ మంత్రికేటీఆర్ పని మరింత సులువయింది. పారిశ్రామికీకరణను.. వరంగల్ కు చేరుస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close