కేటీఆర్ సీఎం… కవిత వర్కింగ్ ప్రెసిడెంట్..!?

సీఎం కేసీఆర్ రాజకీయ ఆస్తుల పంపకానికి జోరుగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా టీఆర్ఎస్‌లో ప్రచారం గుప్పుమంటోంది. కేటీఆర్ సీఎం అనే నినాదం ఇప్పటికే ఫిక్సయిపోయింది. మరి కవిత ఏంటీ అనేచర్చ వస్తోంది. కవితను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఖరారు చేశారని అంటున్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికలయిన తర్వాత కవిత విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇప్పుడు ఆమె కార్మిక సంఘాలను ఏకం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. టీఆర్ఎస్ గెలుపులో కార్మిక సంఘాలు అత్యంత కీలకం.

ఉద్యమ సమ‌యంలో ఉద్యోగుల నుంచి కుల సంఘాల వ‌ర‌కు అన్నింటినీ ఏర్పాటు చేయడంలో టీఆర్ఎస్ కీలకంగా వ్యవహరించింది. వివిధ ఉద్యోగ, కార్మిక సంఘాల‌కు ఆ పార్టీ నేత‌లే గౌర‌వాధ్యక్షులుగా ఉండేవారు. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత వైఖ‌రిని పూర్తిగా మార్చుకుంది. కొన్ని సంఘాల నుంచి వ‌చ్చిన త‌ల‌నొప్పుల‌తో ఆయా సంఘాల‌కు గౌర‌వాధ్యక్ష ప‌ద‌వుల నుంచి టీఆర్ఎస్ నేత‌లు త‌ప్పుకోవాల‌ని కేసీఆర్ ఆదేశించారు. అలా ఆర్టీసీ కార్మిక సంఘం నుంచి హరీష్ రావు, సింగ‌రేణి కార్మిక సంఘం నుంచి కవిత కూడా వైదొలిగారు. మిగతా నేతలు కూడా వైదొలిగారు. దీంతో ఉద్యోగ, కార్మిక సంఘాల్లో టీఆర్ఎస్ పట్టు తగ్గింది.

దుబ్బాక ఎన్నిక‌ల్లో ఓట‌మి, జీహెచ్ఎంసీ ఫ‌లితాలు టీఆర్ఎస్‌కు  గుబులు పుట్టించాయి.  దీంతో దూర‌మైన సంఘాల‌ను వ‌ర్గాల‌ను చేర‌దీసే ప‌నిలో ప‌డ్డారు. ఆ బాధ్యత కవితకు అప్పగించారు. ఇటీవ‌ల క‌విత విస్తృతంగా పర్యటిస్తున్నారు. కవితను పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ చేసి ఆ త‌ర్వాత కీల‌క ప‌ద‌వులు అప్పగించేందుకు నిర్ణయించారని ఈ కారణంగానే అనుకుంటున్నారు. కవితను మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. అయితే కేటీఆర్ సీఎం అయితే సాధ్యం కాకపోవచ్చు.  అందుకే కవితకు  పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలనే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. అది వర్కింగ్ ప్రెసిడెంటే కావొచ్చని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లోకేష్ కు పార్టీ పగ్గాలు…తెరపైకి కొత్త డిమాండ్..!!

టీడీపీ అద్యక్ష బాధ్యతలను నారా లోకేష్ కు అప్పగించాలని సొంత పార్టీ నేతలే డిమాండ్ చేస్తున్నారు. పార్టీ కీలక నేత బుద్దా వెంకన్న ఇది రిక్వెస్ట్ కాదు మా డిమాండ్ అంటూ చెప్పుకొచ్చారు....

వైసీపీ నేతలను స్వయం సంతృప్తి చెందేలా నీలి మీడియా కథనాలు..!!

వైసీపీ అనుకూల మీడియా ప్లాన్ మార్చింది. ఏపీలో వైసీపీ ఓటమి ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతుండటంతో వ్యూహాత్మకంగా కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారా..? అనే కథనాలను తెరపైకి తీసుకొచ్చింది. పోలింగ్ ట్రెండ్స్ చూసిన ఎవరికైనా...

గొడవలు చేసింది వైసీపీ – నీతులు చెబుతోంది కూడా వైసీపీనే !

ఏపీ అధికార పార్టీ ఏ మాత్రం నీతి లేకుండా చేస్తున్న స్కిట్స్ ప్రజల్ని ఔరా అనిపిస్తున్నాయి. ఏపీలో జరిగిన ప్రతి అల్లరి వెనుక.. ప్రతి ఘర్షణ వెనుక వైసీపీ కార్యకర్తలే...

బయాస్ చేసుకుంటే ప్రశాంత్ కిషోర్‌కు ఇంత పేరు వచ్చేదా !?

కరణ్ థాపర్ తో ప్రశాంత్ కిషోర్ ఇంటర్యూ తర్వాత ఆయనపై రాజకీయవర్గాల్లో విస్తృతమైన దాడి జరుగుతోంది. ఆయన బీజేపీ కోసం పని చేస్తున్నారని ఆరోపించడం ప్రారంభించారు. దానికి కారణం బీజేపీకి సీట్లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close