మేనిఫెస్టో రిలీజ్ తప్పే..! టీడీపీకి షాకిచ్చిన నిమ్మగడ్డ..!

పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఎన్నికలకు మేనిఫెస్టో రిలీజ్ చేసిన తెలుగుదేశం పార్టీపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మేనిఫెస్టోను ముద్రించినట్లుగా క్లెయిమ్ చేసుకున్న టీడీపీ కార్యదర్శి మద్దిపాటి వెంకటరాజుకు నోటీసులు జారీ చేసింది. ఈ మేనిఫెస్టో అంశంపై వైసీపీ మూడు రోజులుగా విమర్శలు చేస్తోంది. తాము ఫిర్యాదు చేయబోమని… సుమోటోగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వస్తోంది. అయితే… తర్వాత ఏమనుకున్నారో కానీ.. వైసీపీ లీగల్ సెల్ ద్వారా ఫిర్యాదు చేయించారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఎస్‌ఈసీ నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి రెండో తేదీ లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

లేకపోతే ఆ తర్వాత చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజునే… చంద్రబాబునాయుడు పల్లె ప్రగతి – పంచ సూత్రాలు పేరుతో మేనిఫెస్టోను విడుదల చేశారు. పార్టీల గుర్తుల పరంగా జరగని ఎన్నికలకు ఇలా మేనిఫెస్టో విడుదల చేయడం… నిబంధనలకు వ్యతిరేకమని వైసీపీ వెంటనే విమర్శలు ప్రారంభించింది. అయితే గతంలోనూ తాము మేనిఫెస్టోలు విడుదల చేశామని టీడీపీ వాదిస్తూ వస్తోంది.

చివరికి ఆ మేనిఫెస్టోను రిలీజ్ చేయడాన్ని ఎస్‌ఈసీ తప్పు పడుతోంది. ఇప్పుడు ఎస్‌ఈసీకి టీడీపీ సమాధానం ఇచ్చుకోవాల్సిన పరస్థితి. ఒక వేళ సంతృప్తికర సమాధానం ఇవ్వకపోతే.. తదుపరి చర్యలు తీసుకుంటారు. సహజంగా ఎన్నికల కమిషన్ మరోసారి అలాంటి తప్పు చేయవద్దన్న హెచ్చరికలతో సరి పెడుతుంది. పదే పదే చేస్తే… తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. టీడీపీ విషంయలో నిమ్మగడ్డ ఏం చేస్తారో చూడాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close