కేటీఆర్ వర్సెస్ కవిత: కెసిఆర్ ఇంట్లో కోల్డ్ వార్ జరుగుతోందా ?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో కోల్డ్ వార్ జరుగుతోందా? దీని కారణంగానే కేటీఆర్ కు పట్టాభిషేకం చేయాలని కేసీఆర్ అనుకుంటున్నా, ఆ నిర్ణయం వాయిదా పడుతోందా? అనూహ్యంగా కవితను ముఖ్య మంత్రి చేయాలన్న వాదనలు కేసీఆర్ ఇంట్లో తెరపైకి వచ్చాయా? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుత రాజకీయాల్లో అపర చాణక్యుడు అని చెప్పడంలో సందేహం లేదు. అయితే అనేకమంది రాజకీయ నాయకులు తమ వారసులను సరైన రీతిలో ప్రమోట్ చేయడంలో ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తన కుటుంబం నుండి సరైన రీతిలో వారసులను ప్రమోట్ చేయడంలో ఫెయిల్ అవ్వడాన్ని, సోనియా గాంధీ రాహుల్ గాంధీని సరైన రీతిలో ప్రమోట్ చేయడంలో ఫెయిల్ అవ్వడాన్ని దగ్గరనుండి గమనించిన కెసిఆర్ ఆ పొరపాటు తాను చేయకూడదు అన్న ఉద్దేశంతో, మొదటి నుండి కూడా కేటీఆర్ ను తన రాజకీయ వారసుడిగా ప్రొజెక్ట్ చేస్తూనే వచ్చారు. తాను అనుకున్న ఫెడరల్ ఫ్రంట్ వ్యూహం ఫలించి ఉన్నట్లయితే బహుశా ఇప్పటికే కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండేవారు. కానీ అది వర్కౌట్ కాకపోవడం తెలిసిందే. ఇక అప్పటినుండి ఎప్పుడో ఒకప్పుడు కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారు అన్న ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా కేటీఆర్ వర్సెస్ కవిత కోల్డ్ వార్ జరుగుతుంది అన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

తాజాగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం, ఇటీవలికాలంలో కవిత ను ముఖ్యమంత్రి ని చేయాలని కేసీఆర్ పై వివిధ వర్గాల నుండి ఒత్తిడి ఎదురవుతోంది. ముఖ్యంగా పండితుల మీద, జాతకాల మీద విపరీతమైన నమ్మకం ఉన్న కేసీఆర్ తో, కొందరు పండితులు జాతకరీత్యా కేటీఆర్ అంటే కవితకి రాజ్యాధికారం ఇస్తే పార్టీ మనుగడ గొప్పగా ఉంటుందని సూచించినట్లు సమాచారం. ఈ కారణంగానే, కేటీఆర్ కు పట్టాభిషేకం చేయాలన్న కేసీఆర్ ఆలోచన ఎప్పటికప్పుడు వాయిదా పడుతోందని సమాచారం. అయితే పార్టీలో ఇప్పటికే కవిత కంటే కేటీఆర్ పట్ల ఎక్కువ సానుకూలత ఉన్న సంగతి తెలిసిందే.

అయితే రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ఈ చర్చల లో ఎంత వరకు నిజం ఉంది, నిజంగా కేసీఆర్ కుటుంబం లో కోల్డ్ వార్ జరుగుతోందా, లేక టిఆర్ఎస్ పార్టీ లో అయోమయం సృష్టించడానికి విపక్షాలు ఈ ప్రచారాన్ని తెర పైకి తీసుకు వచ్చాయా అన్నది తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడక తప్పదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close