బీజేపీని బెదిరిస్తున్న కేటీఆర్ – రివర్స్ అవుతుందేమో ?

ఫామ్ హౌస్ కేసులో బయటపెట్టింది కొంతేనని.. బయట పెట్టాల్సింది పాన్ ఇండియా సినిమా అంత ఉందని కేసీఆర్‌తో పాటు కేటీఆర్ కూడా ఏదో ఓ సందర్భంలో ప్రతీ రోజూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బీజేపీ నేతల్ని ఓ రకంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుగా వారి మాటలు ఉన్నాయి. కేసీఆర్, కేటీఆర్ బెదిరింపుల తరహా మాటలు.. బీజేబీ హైకమాండ్ స్థాయికి వెళ్లాయో లేదో కానీ… వారు సీరియస్‌గా తీసుకుంటే మాత్రం రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతాయని భావిస్తున్నారు.

మునుగోడులో ఎన్నికల ఫలితం టీఆర్ఎస్‌కు తే్డా వస్తే.. ఆ తర్వాత ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడం అంత తేలిక కాదు. అక్కడ టీఆర్ఎస్ బంపర్ మెజార్టీతో గెలిస్తే మాత్రమే కాస్త బలం ఉంటుంది. గట్టి పోటీ ఎదుర్కొన్నా.. అరకొరగా బయటపడినా.. కష్టమవుతుంది. నిజానికి.. ఫామ్ హౌస్ కేసులో అమిత్ షా వాయిస్ ఉన్నా చేయడానికి ఏమీ ఉండదని.. నిపుణులు చెబుతున్నారు.. తమ పార్టీలో చేరమని ఆహ్వానించి ఉంటారని… అది ఎలా తప్పవుతుందన్నది ఎక్కువ మంది అభిప్రాయం.

అయితే అసలు అక్కడ దృశ్యాలు.. ఉన్నాయో లేదో.. లేకపోతే.. మునుగోడు తర్వాత ఢిల్లీ ప్రెస్ మీట్ పెట్టి రీలీజ్ చేస్తారో కానీ.. ఇప్పటికే ఈ కేసు తేలిపోయింది. పోలీసులు చాలా తేలిగ్గా తీసుకున్నారు. పైగా ఫోన్ ట్యాపింగ్ అంశం తెరపైకి వచ్చింది. హైకోర్టులోనూ పిటిషన్ పడింది. రాజకీయాల్లో ఇలా బెదిరింపులు ప్రతీ సారి వర్కవుట్ కావు. పైగా .. రెండు ప్రభుత్వాలు నడుపుతున్న వారి మధ్య బెదిరింపులు అంటే.. చివరికి రివర్స్ అవడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎక్కువ అధికారం ఎవరి చేతుల్లో ఉంటే వారిదే పైచేయి అవుతుంది.

మోదీ, అమిత్ షాల బ్యాక్ గ్రౌండ్ గురించి పూర్తి అవగాహన ఉన్న నేతలు.. వారిని ప్రజాక్షేత్రంలో కాకుండా ఇలా ఆడియోలు.. వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి.. ఏదో చేద్దామనుకుంటే.. వారిని వెనక్కి తగ్గేలా చేద్దామనుకుంటే.. అంతకు మించిన తెలివి తక్కువ రాజకీయం ఉండనది బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close