మళ్ళీ రాజకీయాలలోకి రానున్న లగడపాటి?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తరువాత రాజకీయాల నుంచి తప్పుకొన్న వారిలో కాంగ్రెస్ మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ కూడా ఒక్కరు. గత రెండేళ్లుగా ఆయన తన వ్యాపారాలను చూసుకొంటూ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన మళ్ళీ రాజకీయాలలోకి తిరిగి రావాలనుకొంటున్నట్లు తాజా సమాచారం. ఆయనకు చాలా వ్యాపారాలున్నాయి. కనుక ప్రజల కోసం కాకపోయినా వాటికోసమయినా రాజకీయాలలో ఉండటం చాలా అవసరం. ఈసారి తన సెకండ్ ఇన్నింగ్స్ ని తెదేపా లేదా బీజేపీతో మొదలుపెట్టే అవకాశం ఉంది.

సాధారణంగా ఆయన ఎన్నికల సమయంలో సర్వేలు జరిపించి ఏ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వస్తుందో ఫలితాలు వెల్లడిస్తుంటారు. కనుక తెదేపా, బీజేపీలలో ఏ పార్టీ మళ్ళీ వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయో అంచనా వేసుకొని ఆ పార్టీలో చేరుతారేమో? ఒకవేళ తెదేపాలో చేరితే ఆయన వచ్చే ఎన్నికలలో విజయవాడ నుంచి లోక్ సభకి పోటీ చేయాలనుకొంటారు. కానీ ఆ స్థానాన్ని కేశినేని నానికి కేటాయించారు కనుక ఆయనకు దక్కే అవకాశం లేదు. ఒకవేళ బీజేపీలో చేరినా అదే పరిస్థితి ఎదురవవచ్చును. బీజేపీకి ఆ స్థానాన్ని విడిచిపెట్టేందుకు తెదేపా అంగీకరించదు. కనుక ఆయన ఆ రెండు పార్టీలలో దేనిలో చేరినా వేరే నియోజక వర్గం నుంచి పోటీ చేయడానికో లేదా రాజ్యసభకి వెళ్లేందుకో సిద్దపడాల్సి ఉంటుంది. ఇంతకీ ఆయన తను రాజకీయాలలోకి తిరిగి వస్తున్నట్లు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ముందు ఆ విషయం ఖరారు అయితే అప్పుడు ఏ పార్టీలో చేరబోతున్నారనే విషయం కూడా ఆయనే ప్రకటించవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close