ఆర్జీవీ ఎన్టీఆర్ పై బ్రహ్మాస్త్రం ఇదేనా?

ఆర్జీవీ తన లక్ష్మీస్ ఎన్టీఆర్ ను చకచకా రెడీ చేస్తున్నారు. సందేహం లేదు. ఇందులో ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబర్లను, చంద్రబాబు భయంకరంగా టార్గెట్ చేస్తారు. దర్శకులు క్రిష్ లాగానో, మహీ లాగానో సున్నితంగా భావోద్వేగాలు మేళవించి చెప్పరు. ఎక్కడో కర్ర గుచ్చినట్లే వుంటుంది వర్మ వ్యవహారం. 

మరి దీనిని ఎలా అడ్డుకుంటారు? సెన్సారు ద్వారా అడ్డుకోవడం సాధ్యం అవుతుందా? ఎందుకంటే ఆంధ్రకు ప్రత్యేకంగా సెన్సారు బోర్డు లేదు. హైదరాబాద్ లోనే వుంది. పైగా సెన్సారు అన్నది కేంద్రం అదుపాజ్ఞలలో వుంటుంది. అందువల్ల ఆ కోణంలో అడ్డంకులు పెద్దగా వుండవు.

మరి అలా అని చూస్తూ, చూస్తూ ఆ సినిమాను అలా వదిలేస్తారా? లేక ఆంధ్రలో ప్రభుత్వం వుంది కనుక, నిషేథం విధిస్తారా? అదేమైనా లాభసాటిగా వుంటుందా? విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల ఆలోచన వేరుగా వుందని తెలుస్తోంది

”..మా నాన్న కథ, మా కుటుంబం కథ, మా ఫ్యామిలీ వ్యవహారం సినిమాగా తీసి రచ్చ చేసే హక్కు ఎవరు ఇచ్చారు..” ఇదీ నందమూరి ఫ్యామిలీ కోర్టుల ద్వారానో? మరో విధంగానో వ్యక్తం చేయబోయే అభ్యంతరం అని తెలుస్తోంది. ఒక విధంగా అది పాయింట్ నే కూడా. కుటుంబ సభ్యులు అది కూడా వాళ్ల పాత్రలను తెరకెక్కించాలంటే సంబందిత జనాల అనుమతి వుండాలి కదా? కోర్టు కూడా ఇదే అడిగితే అప్పుడు పరిస్థితి ఏమిటి?

అందుకే నందమూరి ఫ్యామిలీ ముఖ్యంగా బాలయ్య ఇప్పుడు సైలంట్ గా వున్నట్లు తెలుస్తోంది సరైన సమయం చూసి, ఈ ఫ్యామిలీ పర్మిషన్, ఫ్యామిలీ ప్రైవసీ హక్కుల పాయింట్ ద్వారా సినిమాను ఆపించే ప్రయత్నం చేస్తారని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close