నారాయణ…నారాయణ…

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆ నలుగురు మంత్రుల పెత్తనం పెరిగిపోయిందని వినబడుతున్న మాటలను మంత్రి నారాయణ ప్రకటన రుజువు చేసినట్లయింది. రెవెన్యూ శాఖ చూడవలసిన భూసేకరణ వ్యవహారంలో కూడా ఆయన వేలుపెట్టడంతో సంబంధిత శాఖా మంత్రి కే.ఈ. కృష్ణమూర్తి తన ఆగ్రహాన్ని మీడియా సమావేశంలో బయటపెట్టారు. పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా భూసేకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఇంటా, బయటా వెల్లువెత్తుతున్న విమర్శలతో ఉక్కిరిబిక్కిరి అయిన మంత్రి నారాయణ భూసేకరణను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. అంతటితో ఆగకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలియజేయకుండానే తను భూసేకరణకు నోటిఫికేషన్ ఇప్పించినట్లు చెప్పుకొన్నారు. కానీ ముఖ్యమంత్రికి తెలియకుండా ఇంత కీలకమయిన వ్యవహారంలో తను నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఆయనకి తెలియజేయకుండానే భూసేకరణ నోటిఫికేషన్ కూడా విడుదల చేయించినట్లు చెప్పడంతో మంత్రివర్గంలో మిగిలిన మంత్రులనే కాదు ముఖ్యమంత్రిని కూడా ఆయన డామినేట్ చేస్తున్నట్లు దృవీకరించినట్లయింది. ప్రభుత్వంలో అనేకమంది సీనియర్ మంత్రులున్నప్పటికీ ఎవరూ కూడా ఇలాగ ఇతర శాఖల వ్యవహారాలలో వేలుపెట్టరు. ముఖ్యమంత్రి అనుమతి లేకుండా ఇటువంటి సున్నితమయిన వ్యవహారాల మీద మాట్లాడేందుకు కూడా ఇష్టపడరు. కానీ మంత్రి నారాయణ మాత్రం అన్నీ తానై చక్కబెట్టేస్తున్నారు.

అంతా సవ్యంగా సాగుతున్నంత కాలం ఎవరూ వేలెత్తి చూప(లే)రు. కానీ ఇలాగ అడ్డంగా బుక్ అయిపోయినప్పుడు మాత్రం అందరికీ లోకువే. అయినా మంత్రులు అందరూ ఇంకా పనులుకూడా మొదలుకాని రాజధాని ప్రాంతం చుట్టూ ఉపగ్రహాల్లాగ ఎందుకు తిరుగుతున్నారో తెలియదు. రాష్ట్రంలో రాజధాని నిర్మాణం తప్ప చేయవలసిన పనులు మరేవీ లేవన్నట్లు ఉంది వాళ్ళ వ్యవహారం అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close