కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలని ఏడో ఫేజ్ లో ఖాళీగా ఉన్న స్థలాలను హౌసింగ్ బోర్డు అధికారులు వేలం వేశారు. సగటున గజాన్ని రూ.2.38వేలకు అమ్మారు. అత్యధికంగా ఓ చోట గజం స్థలం రూ.2 లక్షల 98 వేలు పలికింది. ఈ ధరలు రియల్ ఎస్టేట్ వర్గానికి ఆశ్చర్యపరిచారు. రియల్ ఎస్టేట్ కు డిమాండ్ పడిపోయిందని ఇళ్ల స్థలాలను వేలం వేయడం వేస్తే పెద్దగా ధర రాదని అనుకుంటున్న సమయంలో ఊహించనంత భారీ ధరకు అమ్ముడుపోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.
ప్రస్తుతం కూకట్ పల్లిలో కొన్ని చోట్ల గజం ధర లక్ష నుంచి లక్షన్నర వరకూ ఉందని అనుకుంటూ ఉంటారు. కానీ కూకట్ పల్లి ఎవరూ ఊహించనంత రేంజ్ కు చేరిందని తాజాగా స్పష్టమయినట్లయింది. ఇక ఎలాంటి స్థలాలు అక్కడ ప్రైవేటు లావాదేవీలు జరగాలన్నా.. ఈ హెచ్ఎండీఏ వేలాన్ని ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది. కూకట్ పల్లి ఓ ఇరవై ఏళ్ల కిందటి వరకూ నిర్మానుష్యంగా ఉండేది. శివారు ప్రాంతంగా ఉండేది.
కానీ ఇరవై ఏళ్లలో ఏడో ఫేజ్ కూడా పూర్తి అయింది. వై జంక్షన్ దాటాక ప్రారంభమయ్యే కూకట్ పల్లి..ఇప్పుడు హైటెక్ సిటీకి చేరువగా విస్తరించింది. ఏడో ఫేజ్ వరకూ కొన్ని వందల కాలనీలు వచ్చాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ డిమాండ్ తారస్థాయికి చేరింది. హైదరాబాద్లో జూబ్లిహిల్స్ తర్వాతా… మరో హాట్ ప్రాపర్టీ ఏరియాగా మారింది.