న్యాయశాస్త విద్యార్ధిని శర్మిష్ఠ పనోలీకి కోల్ కతా హైకోర్టులో ఊరట లభించింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం..మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఆపరేషన్ సిందూర్ పై సోషల్ మీడియాలో మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా శర్మిష్ఠ పనోలీని పోస్ట్ చేశారని ఆమెపై సు నమోదు అయింది. ఆ తర్వాత ఆమె ఆ పోస్ట్ ను డిలీట్ చేయడమే కాకుండా క్షమాపణలు కూడా చెప్పారు. అయినప్పటికీ మే 31న ఆమెను పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. గురుగ్రామ్ లో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కోర్టులో హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించారు.
కాగా, శర్మిష్ఠ పనోలీ అరెస్ట్ వెస్ట్ బెంగాల్ లో తీవ్ర రాజకీయ దుమారం రేపింది. బీజేపీ నేతలు మమతా బెనర్జీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. లౌకిక వాదం అనేది ఒకేరకంగా ఉండాలని మమతా సర్కార్ కు చురకలు అంటించారు.
ఈ వివాదం అంతర్జాతీయంగా దృష్టిని ఆకర్షించింది. నెదర్లాండ్స్ పార్లమెంట్ సభ్యుడు గీర్ట్ వైల్డర్స్ కూడా శర్మిష్ఠకు మద్దతు ప్రకటించారు.ఆమె అరెస్ట్ బావ ప్రకటన స్వేచ్ఛకు గొడ్డలిపెట్టు అంటూ వ్యాఖ్యానించారు. శర్మిష్ఠ పనోలీని విడుదల చూసేలా చూడాలని ప్రధాని మోడీని కోరారు.