“లీక్‌” రాజకీయం – బీఆర్ఎస్‌ రాంగ్ స్టెప్ ?

టీఎస్‌పీఎస్సీ లీక్ వ్యవహారాన్ని రాజకీయ రంగు పులమడానికి బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అసలు విషయాల కన్నా కొసరు విషయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. రాజకీయ ఆరోపణలకు సిట్ కేసులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. గురువారం రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన సిట్ శుక్రవారం బండి సంజయ్ ను విచారించనున్నారు. ఆ తర్వాత వారిపై కేసులు పెడతారన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో కేటీఆర్ కూడా వారిద్దరికీ లీగల్ నోటీసులు జారీ చేశారు.

రాజకీయాల్లో ఆరోపణలు సాధరణం. అంతకు మించి చేసుకుంటూ ఉంటారు. ఎదురుదాడి కూడా రాజకీయంగానే ఉంటుంది. కానీ ఈ సారి కేటీఆర్ మాత్రం తనపై ఆరోపణలు చేయకుండా కేసులు పెట్టించాలనుకుంటున్నారు. దీంతో ఈ పేపర్ లీకేజీ వ్యవహారం మొత్తం రాజకీయం అవుతోంది. అయితే ఇది వ్యూహాత్మకంగానే చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. పేపర్ లీకేజీ అసలు ఎప్పట్నుంచి జరుగుతోందన్న వివరాలు బయటకు తెలిస్తే.. నిరుద్యోగుల్లో అసహనం పెరిగిపోతుందని… తాము మోసపోయామని అనుకుంటారని దాని కన్నా రాజకీయ మసి పూస్తే టాపిక్ డైవర్ట్ అవుతుందని భావిస్తున్నారని అంటున్నారు.

ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల భర్తీ ఇప్పుడు డొలాయమానంలో పడింది. ఒక్క ప్రశ్నాపత్రం కూడా లీక్ కాలేదని అనుకునే పరిస్థితి లేకుండా పోయింది. అసలు కాన్ఫిడెన్షియల్ కంప్యూటర్ మొత్తం హ్యాక్ అయిందని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలు పెట్టినా యువత నమ్మరు. ఇప్పుడల్లా ఉద్యోగ పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదు. అందుకే బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందంటున్నారు. కానీ ఇది రెండు విధాలుగా నష్టం చేస్తుందని.. యువత లో ఆగ్రహాన్ని పెంచుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మీడియా వాచ్ : బ్యాన్ చేసి ఏబీఎన్‌ క్రేజ్ పెంచేసిన జగన్ !

ఏబీఎన్ చానల్ కు జగన్ ఎంత మేలు చేశారంటే.. ఇప్పుడా చానల్ యూ ట్యూబ్ లో జాతీయ.స్థాయిలో నాలుగో స్థానంలో ఉంది. ఏపీలో ఆ చానల్ రాకుండా చేశారు. డిష్‌లలో వస్తుంది. కానీ...

లిక్కర్ స్కాంలో కవితపై ఆధారాలున్నాయన్న కోర్టు !

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు అనూహ్యమైన షాక్ తగిలింది. నేరుగా కోర్టే ప్రాథమిక అదారాలు ఉన్నాయని వ్యాక్యానించింది. ఇప్పటి వరకూ ఈడీ, సీబీఐ ఆరోపణలు చేసింది. కానీ న్యాయమూర్తి ఆధారాలున్నాయని...

వారాహియాత్రకు భారీ ఏర్పాట్లు చేస్తున్న జనసేన !

ముందస్తు ఎన్నికలు వచ్చినా రాకపోయినా జనంలోనే ఉండేందుకు పవన్ కల్యాణ్ రెడీ అయ్యారు. పద్నాలుగో తేదీన వారాహి యాత్రను ప్రారంభిస్తున్నారు. రెండు రోజుల ముందే అమరావతి చేరుకుని హోమాలు చేయనున్నారు. ఆ...

గుడివాడ టిడ్కో ఇళ్లు -పరువు పోగొట్టుకున్న కొడాలి నాని !

గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ హయాంలో టిడ్కో ఇళ్లను నిర్మించారు. వాటిని లబ్దిదారులకు కేటాయించారు. చివరికి రోడ్లు, కరెంట్ వంటి సదుపాయాలు కల్పించి లబ్దిదారులకు హ్యాండోవర్ చేయాల్సిన సమయంలో ప్రభుత్వం మారింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close