లిక్కర్ స్కాంలో అరెస్టులు – తెలుగు రాష్ట్రాల్లో అలజడి !

దేశ రాజ‌ధాని ఢిల్లీలో వెలుగు చూసిన లిక్క‌ర్ స్కాంలో సీబీఐ తొలి అరెస్ట్ చేసింది. ఓన్లీ మ‌చ్ లౌడ‌ర్ సీఈఓగా ప‌నిచేస్తున్న విజ‌య్ నాయ‌ర్‌ను అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకూ కీలక విచారణలు జరుపుతున్న సీబీఐ ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదు. మంగ‌ళ‌వారం నుంచి అరెస్ట్‌ల ప‌ర్వం మొద‌లైన‌ట్టైంది. ఇందులో తెలుగు రాష్ట్రాల రాజకీయ లింకులు ఉండటంతో ఇక్కడ కూడా ఎక్కవ చర్చనీయాంశం అవుతోంది.

సీబీఐ కేసులు నమోదు చేసిన తర్వాత ఈడీ కూడా ఈ కేసులో విచారణ జరుపుతోంది. తమ బినామీల ద్వారా ఢిల్లీలో లిక్కర్ దందాలో పెట్టుబడులు పెట్టారన్న కోణంలో విచారణ చేస్తున్నారని అంటున్నారు. బినామీలను ముందుపెట్టి అనధికారికంగా పెట్టుబడులు పెట్టి.. బ్లాక్ మనీనీ వైట్ చేసుకున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన కీలక సమాచారం ఈడీ అధికారులకు లభించిందని తెలుస్తోంది. అనుమానిత సంస్థలు, వాటికి సంబంధించిన అనుమానాస్పద లావాదేవీల గుట్టు రట్టు చేసే పనిలో ఈడీ అధికారులు ఉన్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఈడీ అధికారులు ఇప్పటికే హైదరాబాద్ లో పలు సార్లు సోదాలు జరిపారు. సీబీఐ నమోదు చేసిన కేసులో ఏ14గా ఉన్న మద్యం వ్యాపారి అరుణ్‌ రామచంద్ర పిళ్లై నివాసం, కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. ఆయన వ్యాపార భాగస్వామిలుగా ఉన్న బోయినపల్లి అభిషేక్‌, గండ్ర ప్రేమసాగర్‌ ఇళల్లోనూ సోదాలు నిర్వహించింది. ఈడీ పలువుర్ని ఢిల్లీలో ప్రశ్నిస్తోంది. ఈ క్రమంలో సీబీఐ అరెస్టులు ప్రారంభించడం కలకలం రేపుతోంది. ఈడీ ప్రశ్నిస్తున్న వారిని కూడా అరెస్టులు చేసే అవకాశం ఉందన్న ప్రాచరం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close