ఆర్మూర్ రివ్యూ: దుబాయ్ జీవన్ రెడ్డి ఎదురీదుతున్నాడా..?

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌ నియోజకవర్గంపై ఇప్పడు అందరి దృష్టి పడింది. మంత్రి కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడయిన తాజామాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి.. రెండో సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆయనపై ఇటీవల నటీమణి శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. జీవన్ రెడ్డికి…కాంగ్రెస్ నాయకులు ఆకుల లలిత సవాల్ విసురుతున్నారు ప్రధాన ప్రత్యర్థిగా… విజయం కోసం పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో అనుచర వర్గం ఉన్న..మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి.. టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆయన ఆర్మూర్ నుంచి లేదా బాల్కొండ నుంచి పోటీ చేసి ఉండేవారు. కానీ టీఆర్ఎస్ ప్రభంజనం ఉంటుందనుకున్న ఆయన… తొందరపడి టీఆర్ఎస్‌ లో చేరిపోయారు. ఇప్పుడు మారిపోయిన పరిస్థితులు చూసి.. ఆయన అనుచర వర్గం ఇబ్బంది పడుతోంది.

ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత ఉందన్న ప్రచారం జరుగుతోంది. జీవన్‌రెడ్డి హైదరాబాద్‌లో ఎక్కువగా ఉంటారు. ఆయన సోదరుడు.. షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూంటారు. ఆయన ఇసుక దందాల్లో వేలు పెట్టడంతో.. ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. జీవన్ రెడ్డి వ్యవహారశైలితో చాలా మంది నేతలు ఆయనకు దూరమయ్యారు. దళిత యువకులు తలారిసత్యం, చేపూర్ రవి హత్య కేసుల విషయంలో… జీవన్ రెడ్డిపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఆయనపై కేసు నమోదు చేయాలని ప్రజాసంఘాలు హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ కేసు కోర్టులో కోనసాగుతుంది. దీంతో దళితులు జీవన్‌రెడ్డికి దూరం ఉన్నారు. గతంలో జీవన్‌రెడ్డి గల్ప్‌లో ఉండేవారు. ఆ సమయంలో అక్కడ బ్యాంకులను మోసం చేసి వచ్చారు. అక్కడి బ్యాంకులు భారతదేశంలోని కేంద్రహోంశాఖకు జీవన్‌రెడ్డిపై లేఖను పంపారు. దీనిని వడ్డీతో సహా చెల్లించి బయటపడినట్లు చెబుతున్నారు. ఇదీ కాక.. ఆర్మూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త..బబ్లూ దొంగ బంగారం కేసులో అరెస్టయ్యారు. ఈయనను.. జీవన్ రెడ్డి వెనకేసుకొచ్చారు. ఇతన్ని పార్టీ నుంచి నిజామాబాద్ ఎం.పి కల్వకుంట్ల కవిత ప్రకటించారు. అయితే.. ఎమ్మెల్యే మాత్రం.. పార్టీలో పెద్ద పీట వేస్తున్నారు.

మున్సిపాల్ వ్యవహారాల్లో బబ్లూ పెత్తనం చెలయిస్తారనే ఆరోపణలు ఉన్నాయి.దీంతో కౌన్సిలర్లు కూడా పార్టీ కార్యక్రమాల్లో అంతమాత్రంగానే ఉంటున్నారు.మండల స్థాయిలో ద్వితీయశ్రేణి నాయకులు పట్టించుకోవడంతో ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. దీంతో జీవన్‌రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్మూర్‌లో లెదర్‌పార్క్,లక్కంపల్లి సెజ్‌లో పరిశ్రమలు తీసుకురావడంలో జీవన్‌రెడ్డి విఫలం అయ్యారనే అసంతృప్తి ప్రజల్లో ఉంది. గత ఎన్నికల్లో ఉన్న నేతలు ఇప్పుడు ప్రచారంకు అంతంత మాత్రంగానే దూరమవుతున్నారు. గత ఎన్నికల్లో జీవన్‌రెడ్డికి సన్నిహితులు, ఆన్ని తామై వ్యవహరించిన పోద్ధుటూరి వినయ్ కుమా ర్‌రెడ్డి, నిమ్మల జలందర్‌యాదవ్‌లు దూరంగా ఉన్నారు. వినయ్‌కుమార్‌రెడ్డి బీజేపీ ఆభ్యర్థిగా బరిలో నిలువగా, జలంధర్‌యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌పార్టీ ఆభ్యర్థి ఆకుల లలిత నామినేషన్‌కు 40 వేల మంది వరకు పాల్గొనడంతో కార్యకర్తల్లో ,నాయకుల్లో ఉత్సాహం నెలకోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హతవిధీ… వైసీపీకి ఏమిటీ దుస్థితి..!?

జగన్ బస్సు యాత్ర పేలవంగా సాగుతోంది. వరుస సర్వేలు షాక్ ల మీద షాకులు ఇస్తున్నాయి. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. కూటమి అధికారం దిశగా దూసుకుపోతోంది. ఏదైనా చేయాలి..? అధికారం...

ప్ర‌భాస్ టైటిల్ వాడుకొంటున్నారా?

హాస్య న‌టుడు ప్రియ‌ద‌ర్శి హీరోగా ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. న‌భా న‌టేషా క‌థానాయిక‌. ఈ చిత్రానికి 'డార్లింగ్' అనే పేరు పెట్టే ఆలోచ‌న‌లో ఉంది చిత్ర బృందం. ప్ర‌భాస్ ఊత‌ప‌దం 'డార్లింగ్‌'. ఈ...

ఎడిటర్స్ కామెంట్ : పాలిటిక్స్‌కు ఫేక్ వైరస్ !

" నిజమో అబద్దమో మన ప్రత్యర్థుల్ని దెబ్బ తీస్తుందనుకుంటే అది ప్రచారం చేయండి.. " అని కొన్నేళ్ల క్రితం బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమిత్ షా ఉత్తరప్రదేశ్‌లో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం...

దూరదర్శన్ లోగో కలర్ మార్పు… కారణం అదేనా..?

దూరదర్శన్... చాలా ఫేమస్ ఛానెల్. అప్పట్లో ఎక్కడ చూసినా దూరదర్శన్ ప్రసారాలే.అందుకే దూరదర్శన్ ఛానెల్ కు ఇప్పటికీ అసంఖ్యాకమైన ప్రేక్షకులు ఉన్నారు. ఇదంతా బాగానే ఉన్నా, సడెన్ గా దూరదర్శన్ లోగో కలర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close