గుడ్ న్యూస్… లాక్ డౌన్ పొడిగింపు లేదు

ఏప్రిల్ 14 వరకూ కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ కి ప్రకటించిన సంగతి విదితమే. అయితే కరోనా మహమ్మారి మరింతగా ప్రబలతున్న నేపథ్యంలో ఈ లాక్ డౌన్ ని పొడిగిస్తారని, అవసరమైతే జూన్ 1 వరకూ కొనసాగిస్తారని ప్రచారం జరుగుతోంది. జరుగుతున్న పరిణామాలూ, కరోనా బాధితుల సంఖ్య పెరగడం, కరోనా పై మిగిలిన దేశాలు అవలంభిస్తున్న వైఖరి చూస్తే.. అది నిజమేనేమో అనిపిస్తోంది. దానికి తోడు ఇ.ఎం.ఐ లు మూడు నెలల పాటు లేవని బ్యాంకులు ప్రకటించడం చూస్తుంటే… మరో రెండు నెలల పాటు ఈ లాక్ డౌన్ తప్పదని అందరూ ఓ అంచనాకు వచ్చేశారు.

ఈ నేపథ్యంలో ఓ శుభవార్త వచ్చింది. లాక్ డౌన్ ని పొడిగిస్తున్నామన్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని, ఇవన్నీ నిరాధారమైన వార్తలని కేంద్రం కొట్టిపారేసింది. ఏప్రిల్ 14 వరకే లాక్ డౌన్ అని, దీన్ని పెంచే విషయం ఇప్పటి వరకూ చర్చకే రాలేదని కేంద్ర కాబినేట్ ప్రధాన కార్యదర్సి రాజీవ్ గౌబా తెలిపారు. నిజంగా ఇది శుభవార్తే. కాకపోతే… లాక్ డౌన్ ని పెంచే ప్రతిపాదన కేంద్రం యోచిస్తోందని,. అయితే ఇది ఇప్పుడే ప్రకటిస్తే ప్రజలు భయకంపితులు అవుతారని, ఏప్రిల్ 14నే పొడిగింపు విషయాన్ని ప్రకటిస్తారని మరోవైపు కొత్త విశ్లేషణలు పుట్టుకొస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close