ఉద్యోగుల జీతాలు తగ్గించే సాహసం జగన్ చేయలగరా..?

ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందన్న కారణంగా ఉద్యోగుల జీతభత్యాల్లోనూ కోత పెట్టాలన్న ఆలోచనలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నారు. తెలంగాణ పరిస్థితే అలా ఉంటే.. ఏపీ పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉండాలి..? అన్న చర్చ సహజంగానే వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గురించి ప్రత్యేకంగాచెప్పుకోనవసరం లేదు. గత ఆర్థిక సంవత్సరంలో రూ. అరవై వేలకోట్లు అప్పులు చేసి ప్రభుత్వం సరికొత్తరికార్డు సృష్టించింది. దానికి తోడు ఇప్పుడు ఆదాయం పూర్తిగా పడిపోయింది.లాక్ డౌన్ కారణంగా.. రోజూ వచ్చే ఆదాయం రావడం లేదు. ఇలా ఎంత కాలం ఉంటుందో తెలియదు. కానీ ప్రభుత్వం.. ఖచ్చితంగా చెల్లించాల్సిన ఖర్చులో జీతాలు, పెన్షన్లు,సామాజిక పెన్షన్లు ఉంటాయి.

లాక్‌డౌన్‌తో పడిపోయిన ఏపీ ఆదాయం..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జీతాలు,పెన్షన్లు, సామాజిక పెన్షన్లతో వార్డు,గ్రామ సచివాలయ ఉద్యోగులు,వాలంటీర్లకు చెల్లించడానికి నెలకు ఎడెనిమిది వేల కోట్లు అవసరం అవుతాయి. ప్రతీ సారి జీతాల సమయం దగ్గర పడేసరికి అధికారయంత్రాంగానికి తిప్పలు తప్పడం లేదు. చివరి క్షణంలో ఓవర్ డ్రాఫ్ట్‌కో మరో…ప్రత్యామ్నాయమోచూపి బండి లాగించేస్తున్నారు.అయితే… అప్పట్లో ఎంత లేదన్నా… ఆదాయం వచ్చేది. లాక్ డౌన్ కారణంగా ఇప్పుడీ ఆదాయానికి గండి పడింది.దీంతో ఆర్థిక పరిస్థితి మరింతగా చితికిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది.

సలహాదారులకు రూ.కోట్లకు కోట్లు ఇచ్చేస్తున్న ఏపీ..!

కరోనా, లాక్ డౌన్‌ల కారణంగా ఆర్థిక పరిస్థితి చితికిపోయిందని … జీతాలు తగ్గించడమో.. లేకపోతే.. పథకాలు ఎగ్గొట్టడమో కూడా ధైర్యంగా చేయలేని పరిస్థితి ఏపీ ముఖ్యమంత్రికి ఉంది. దీనికి కారణం..ప్రభుత్వం విచ్చలవిడిగా చేస్తున్న ఖర్చే. సలహాదారుల పేరుతో పెద్ద ఎత్తున నియామకాలు జరిపిన ఏపీ సర్కార్.. ఒక్కొక్కరికి నెలకు రూ. నాలుగు లక్షల వరకూ ముట్ట చెబుతోంది. ఇలా సలహాదారుల జీతాలకే నెలకు.. మూడు, నాలుగు కోట్లు వెచ్చిస్తున్నరన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో సాక్షి పత్రిక నుంచి పెద్ద ఎత్తున మనుషుల్ని ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా తీసుకున్నారు. ఇలా తీసుకుంటున్న వారెవరికీ పని ఉండదు. కానీ వారందరికి ఠంచన్‌గా జీతాలువెళ్లిపోతాయి.

ఓ వైపు దుబారా చేస్తూ..మరోవైపు తమ జీతం తగ్గిస్తే ఎవరైనా ఊరుకుంటారా..?

అస్మదీయులకు లేని పదవులు ఇచ్చి కోట్ల ప్రజాధనాన్ని ఇట్టే పంచేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి .. తీరా కష్టాలువచ్చాయని చెప్పి ఉద్యోగుల తీతాలు.. పథకాలను నిలిపివేయడం..వంటి చర్యలకు పాల్పడితే మాత్రం తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగులు కామ్‌గా ఉండే అవకాశం లేదు. ఇప్పటికే వారు సీపీఎస్ రద్దు కోసం ప్రయత్నిస్తున్నారు. జగన్ హామీఇచ్చి నెరవేర్చలేదు. ఇప్పుడు జీతాలు కూడా తగ్గిస్తామంటే తిరుగుబాటు చేస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close