పవన్ తమిళ్ ట్వీట్.. సీఎం “విరైవిల్” రియాక్షన్..!

ఆంధ్రులు ఎక్కడ కష్టాల్లో ఉన్నారని తెలిసినా.. వారిని ఆదుకునేందుకు తన వంతు ప్రయత్నం పవన్ కల్యాణ్ చేస్తూంటారు. ఇలా ఆయన చేసిన ప్రయత్నం తమిళనాడు తీరంలో ఇరుక్కుపోయిన ఉత్తరాంధ్ర మత్స్యకారుల కడుపు నింపుతోంది. నేరుగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనీ స్వామినే.. పవన్ కల్యాణ్ విజ్ఞప్తిపై స్పందించి.. వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం సీహెచ్ చొలగండి గ్రామానికి చెందిన సుమారు 30 మంది మత్స్యకారులు చేపల వేట కోసం తమిళనాడు తీరానికి వెళ్లారు. అయితే లాక్‌డౌన్ కారణంగా చెన్నై హార్బర్‌ దగ్గర వారంతా చిక్కుకుపోయారు. కనీస అవసరాలు తీరేందుకు అవసరమైన సొమ్ము కూడా లేకపోవడంతో.. ఆకలితో అలమటిస్తున్నారు.

ఈ విషయం జనసేన పార్టీ నేతల ద్వారా తెలుసుకున్న పవన్ కల్యాణ్ వెంటనే.. వారిని ఆదుకోవాలని.. తమిళనాడు ముఖ్యమంత్రి ఈకే పళనిస్వామిని ట్విట్టర్ ద్వారా కోరారు. పవన్ కల్యాణ్ ఈ ట్వీట్‌ను పూర్తిగా తమిళంలో చేశారు. పవన్ కల్యాణ్ తమిళ ట్వీట్ పై పళని స్వామి వెంటనే స్పందించారు. వారిని ఆదుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు అధికారులు ఉత్తారంధ్ర జాలర్లకు నిత్యావసరాల సరుకులు అందించినట్లుగా తెలుస్తోంది.

పవన్ కల్యాణ్.. ఈ తమిళం ట్వీట్‌ను.. పళని స్వామికి చేశారు… అలాగే.. మరో ట్వీట్‌లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లారు. అయితే.. ఏపీ సీఎంవో అధికారులకు పవన్ కల్యాణ్ ట్వీట్ విషయాన్ని పట్టించుకునే తీరిక లేకపోయింది. ఇతర రాష్ట్రాల్లో ఇరుక్కుపోయిన అనేక వేల మంది ఏపీ వాసుల విషయంలో ఏపీ సర్కార్.. పట్టనట్లుగా ఉంటోందన్న విమర్శలు వస్తున్న తరుణంలో.. ఇతర రాష్ట్ర సీఎంతో మాట్లాడి.. పవన్ కల్యాణ్.. ఆదుకోవడం… హాట్ టాపిక్‌గా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close