తెలంగాణలో లాక్‌డౌన్ పెట్టేసిన మీడియా..!

ప్రజలకు నిజాలు చెప్పాల్సిన మీడియా పుకార్లకు అలవాటుపడిపోయింది. లేనిపోనివి చెప్పి ప్రజల్ని భయపెడితే.. చాలనే స్టేజ్‌కు దిగజారిపోయింది. రాజకీయంగా తాము మద్దతుగా నిలిచే పార్టీకి సపోర్టుగా ఇతర నేతలపై పుకార్లు పుట్టించే అలవాటు నుంచి మెల్లగా ప్రజల్ని భయపెట్టే పుకార్లను పుట్టించే దిశగా తెలుగు టీవీ చానళ్లు దిగజారిపోయాయి. తెలంగాణలో ముఫ్పయ్యో తేదీ తర్వాత లాక్ డౌన్ అంటూ.. ఒక్క సారిగా చానళ్లు బుధవారం రాత్రి పుకార్లు లేపాయి. దీంతో ఒక్క సారిగా పానిక్ ప్రారంభమయింది. ప్రజల్లో కలవరం కలిగింది. ఎలాంటి పరిస్థితులు వస్తాయోనని ప్రజలు నిత్యావసరాలు.. ఇతర వస్తువులు పెద్ద ఎత్తున కొనుగోలుకు ఆసక్తి చూపడం ప్రారంభించారు.

ఈ ప్రచారం.. ఉద్ధృతం అవుతూండటం.. ప్రభుత్వానికి అదే పనిగా నిజమా అనే ప్రశ్నలు అందడంతో.. ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. అసలు లాక్ డౌన్ ఆలోచనే ఇంత వరకూ చేయలేదని స్పష్టం చేశారు. అయితే మీడియా మాత్రం.. వైద్య ఆరోగ్య శాఖ సిఫార్సు చేసిందని.. హోంశాఖ పరిధిలో ఉందని.. సీఎం కేసీఆర్ కోలుకున్న తర్వాత చేయబోయే సమీక్షలో మొట్టమొదట తీసుకోబోయే నిర్ణయం లాక్ డౌన్ అంటూ కథనాలు అల్లేసింది. డీహెచ్ శ్రీనివాసరెడ్డి మీడియాముందుకు వచ్చి లాక్ డౌన్ కథలన్నీ ఉత్త కథలేనని… ఆరోగ్య శాఖ నుంచి ఎలాంటి లాక్ డౌన్ ప్రతిపాదనలు వెళ్లలేదని స్పష్టం చేశారు.

దీంతో… మీడియా చానళ్లు సర్దుకున్నాయి. ఆ తర్వాత ఆ పుకార్లనుప్రసారం చేయడం ఆపేశాయి. కానీ జరగాల్సిన ప్రచారం మాత్రం జరిగిపోయింది. ప్రజల్లో పానిక్ ప్రారంభమయింది. మీడియా చానళ్లు సంక్షోభసమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ప్రజల జీవితాలను ప్రభావితం చేసే విషయాన్ని నిజాలను నిర్ధారణ చేసుకుని ప్రసారం చేయాల్సి ఉంటుంది. కానీ అదేం లేకుండా బాధ్యతా రాహితంగా చానళ్లు ప్రవర్తిస్తున్నాయి. ఈ విషయంలో రోజు రోజుకు దిగజారిపోతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close