“తుగ్లక్” అంటూ జగన్ కు కొత్తపేరు ఇచ్చిన లోకేష్

మాజీ మంత్రి లోకేష్ జగన్ కు ఒక కొత్త పేరు ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పై జగన్ వైఖరిని తప్పు పట్టిన కేంద్రమంత్రి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ, “తుగ్లక్ గారు ఉన్నారా? విన్నారా?” అంటూ జగన్ మీద సెటైర్లు వేశారు.

లోకేష్ ట్వీట్్ చేస్తూ, “తుగ్లక్ గారు ఉన్నారా? విన్నారా? పోలవరం టెండర్లు రద్దు చెయ్యడం బాధాకరం, మీ తుగ్లక్ చర్య వల్ల ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుంది, ఖర్చు కూడా పెరుగుతుంది అని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ గారు లోక్ సభ లో చెప్పారు. పోలవరం ప్రాజెక్టు లో 2600 కోట్ల అవినీతి జరిగిపోయింది అంటూ తల తిక్క లెక్కలు చెబుతున్న మిమ్మల్ని చూస్తుంటే జాలి వేస్తుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఖర్చు చేసిన ప్రతి రూపాయికి ఒక లెక్క ఉంది. పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ, కేంద్ర జలసంఘం,
కేంద్ర జలవనరులశాఖ, సిడబ్ల్యుసి, కేంద్ర ఆర్థికశాఖ ఆమోదించిన తర్వాతే నాబార్డ్ నిధులు విడుదల చేస్తుంది. ఇన్ని కేంద్రవ్యవస్థలకు కనిపించని అవినీతి మీకు కనిపించింది. రివర్స్ టెండరింగ్ అంటే ఆంధ్రుల జీవనాడి పోలవరానికి టెండర్ పెట్టడమని అర్థమయింది” అంటూ వ్రాసుకొచ్చారు.

ఒక నాలుగేళ్ల కిందట లోకేష్ ని మొదటి సారి “పప్పు” అంటూ సోషల్ మీడియాలో వై ఎస్ ఆర్ సి పి పార్టీకి సంబంధించిన వారు మొదలు పెట్టినప్పుడు ఆ పదం ఇంతగా పాపులర్ అవుతుందని ఎవరూ అనుకోలేదు. అయితే లోకేశ్ తెలుగు ఉచ్చారణలో చేసిన పొరపాట్ల కారణంగా ఆ పదం సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. ఇప్పుడు లోకేష్ జగన్ కు ఇచ్చిన తుగ్లక్ అనే పేరు పాపులర్ అవుతుందా లేదా అన్నది కూడా జగన్ భవిష్యత్తులో తీసుకొనే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. జగన్ గనుక నాలుగైదు తలక్రిందుల నిర్ణయాలు తీసుకున్నట్లయితే, ఈ పేరు జన సామాన్యంలోకి వెళ్లే అవకాశం కూడా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close