బంధువులకు పందేరం..! “ఐటీ గ్రిడ్” లోకేశ్వర్ రెడ్డికీ ఓ సలహాదారు పదవి..!

ఎన్నికలకు ముందు ఐటీ గ్రిడ్ పేరుతో… టీడీపీ యాప్, వెబ్ సైట్‌ను టార్గెట్ చేసి.. ప్రజల వ్యక్తిగత సమాచారం… చోరీ చేశారంటూ… హడావుడి చేసిన కేసుల్లో.. తెర ముందు వైసీపీ పెట్టిన వ్యక్తి పేరు తుమ్మల లోకేశ్వర్ రెడ్డి. ఐటీ నిపుణుడిగా.. వైసీపీ ప్రచారం చేసుకుని.. విజిల్ బ్లోయర్ గా… కేటీఆర్ సర్టిఫికెట్ ఇచ్చిన ఆ వ్యక్తికి.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కీలక పదవి దక్కింది. నేరుగా ముఖ్యమంత్రికి సలహాదారుగా నియమితులయ్యారు. సలహాదారులందరికీ.. నెలకు రూ. 3లక్షలకుపైగా జీతభత్యాలు ఉన్నందున ఈయనకు కూడా.. అలాగే… ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అదనంగా సిబ్బంది, కార్లు, క్వార్టర్లు, పింగాళి గ్లాసులు ఇతర వస్తువులు కొనుగోలుకు… నిధులు ఇస్తారు.

నిజానికి ఐటీ గ్రిడ్ అనే కంపెనీని టార్గెట్ చేయడానికి కర్త, కర్మ, క్రియ విజయసాయిరెడ్డి. ఆయన తన స్కెచ్‌ను.. ఈసీ వద్ద పొరపాటున.. రిజిస్టర్ చేసి.. దొరికిపోయారు. విజయసాయి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జనవరి 23వ తేదీన ఐటీ గ్రిడ్ సంస్థలో సోదాలు చేశారు. కానీ కేసు అధికారికంగా నమోదు చేయలేదు. తర్వాత అసలు విషయం బయటపడటంతో.. వైసీపీ నేత లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారంటూ.. హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. లోకేశ్వర్ రెడ్డి.. జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు. ఆయన ఏ ఐటీ కంపెనీల్లో పని చేశారో ఎవరికీ తెలియదు కానీ.. డేటా నిపుణుడిగా చెప్పుకుని… ఆయన ఫిర్యాదుపై కేసులు పెట్టారు. దాని కేంద్రంగా టీడీపీపై బురద చల్లారు. ఇప్పుడు.. వైసీపీ అధికారంలోకి వచ్చినా.. ఆ కేసులో కదలిక లేదు.

ఈ తుమ్మల లోకేశ్వర్ రెడ్డికి ఇప్పుడు.. ఉద్యోగం కల్పించారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే వివిధ రంగాల్లో సలహాదారుల పేరుతో పదుల సంఖ్యలో … నియామకాలు జరిపిన సర్కార్.. కొత్తగా… టెక్నికల్ సలహాదారుగా.. లోకేశ్వర్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జగన్మోహన్ రెడ్డి సలహాదారులందరూ.. అయితే… బంధువులు.. లేకపోతే సాక్షి ఉద్యోగులు. లోకేశ్వర్ రెడ్డి నియామకంతో.. మరోసారి ఆ విషయం స్పష్టమయిందనే విమర్శలు వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు.. అందుకే టార్గెట్ చేశారా..?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నందినగర్ లో కేసీఆర్ ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉండటంతో అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసినట్లుగా...

వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ‌ ఈ శిరోముండ‌నం కేసు ఏంటీ?

వైసీపీ ఎమ్మెల్సీ, ప్ర‌స్తుత మండ‌పేట తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ శిరోముండ‌నం కేసు ఏపీలో సంచ‌ల‌నంగా మారింది. 28 సంవ‌త్స‌రాల త‌ర్వాత తీర్పు వెలువ‌డ‌గా... అసలు ఆరోజు ఏం జ‌రిగింది? ఎందుకు ఇంత...

విష్ణు ప్ర‌మోష‌న్ స్ట్రాట‌జీ: భ‌క్త‌క‌న్న‌ప్పపై పుస్త‌కం

రాజ‌మౌళి మెగాఫోన్ ప‌ట్టాక‌, మేకింగ్ స్టైలే కాదు, ప్ర‌మోష‌న్ స్ట్రాట‌జీలు కూడా పూర్తిగా మారిపోయాయి. `బాహుబ‌లి`, `ఆర్‌.ఆర్‌.ఆర్‌` కోసం జ‌క్క‌న్న వేసిన ప‌బ్లిసిటీ ఎత్తులకు బాలీవుడ్ మేధావులు కూడా చిత్త‌యిపోయారు. ఓ హాలీవుడ్...

జ‌గ‌న్ కు షాక్… వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థికి 18నెల‌ల జైలు

వైసీపీ అధినేత జ‌గ‌న్ కు మ‌రోషాక్ త‌గిలింది. వైసీపీ ఎమ్మెల్యేగా మండ‌పేట అసెంబ్లీ నుండి పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు కోర్టు 18నెల‌ల జైలు శిక్ష విధించింది. 28 సంవ‌త్స‌రాల క్రితం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close