బెంగళూరుకి చేరిపోయిన విశాఖ లూలూ మాల్..!

దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుల్లో కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప.. లూలూ గ్రూప్ యాజమాన్యాన్ని తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా అంగీకరింపచేశారు. మంచి రాయితీలిచ్చి.. బెంగళూరు వంటి నగరం పిలిస్తే.. లూలూ గ్రూప్ ఆలోచిస్తుందా.. ఓకే చెప్పేసింది. అక్కడ అతి పెద్ద మాల్ నిర్మించబోతోంది. కొన్ని వేల మందికి ఉపాధి లభించబోతోంది. కానీ ఇక్కడ అసలు విశేషం ఏమిటంటే..ఈ లూలూ గ్రూప్.. ఇదే మాల్ డిజైన్‌ను.. రెడీ చేసుకుంది విశాఖ కోసం. శంకుస్థాపన కూడా చేసింది.

ఏషియాలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ గా విశాఖలో మాల్‌ను తీర్చిదిద్దాలను.. లూలూ గ్రూప్ అనుకుంది. 9 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక హంగులతో నిర్మించడానికి ఏర్పాట్లు చేసింది. హోటల్స్, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన యుఏఈకి చెందిన లూలూ గ్రూప్ తమ వ్యాపారాల్లోనే విశాఖ మాల్‌ను మణి మకుటంగా మార్చాలనుకుంది. 7వేల మందితో గ్లోబల్ ఈవెంట్స్ ను నిర్వహించుకునేలా భారీ కన్వెన్షన్ సెంటర్ తో పాటు అత్యాధునికమైన ఫంక్షన్ హాల్స్.. ఈ కన్వెన్షన్ సెంటర్ ప్రత్యేకత.. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ విశాఖ చుట్టుపక్కల యువతరు పదివేల మందికి ఉపాధి దొరకుతుందని అంచనా వేశారు. ప్రభుత్వం మారగానే జగన్మోహన్ రెడ్డి లూలూ గ్రూప్‌ను తరిమేశారు. విశాఖలో మాల్ అవసరం లేదన్నారు. అక్కడి ప్రజలకు ఉపాధి దొరకకపోయినా పర్వాలేదనుకున్నారు. వారికి కేటాయించిన 9 ఎకరాలను క్యాన్సిల్ చేశారు.

జగన్ ప్రభుత్వం దెబ్బకు .. ఠారెత్తిపోయిన లూలూ గ్రూప్.. ఏపీలో పెట్టుబడులు పెట్టబోమని తేల్చి చెప్పేసింది. అంత్జాతీయంగా గుర్తింపు పొందిన లూలూ గ్రూప్ ఇలాంటి ప్రకటన చేయడం.. ఏపీపై.. ఇన్వెస్టర్ల అపనమ్మకాన్ని పెంచింది. ఇప్పుడా ఆ లూలూ గ్రూప్ విశాఖలో తాము పెట్టాలనుకున్న పెట్టుబడిని బెంగళూరుకు మార్చింది. విశాఖ ఉపాధి బెంగళూరుకు వెళ్లిపోయింది. ఆదాని డేటా సెంటర్ పోవడంతోనే… విశాఖ ఓ గొప్ప అవకాశాన్ని కోల్పోయినట్లయింది. లూలూ గ్రూప్ పోవడంతో.. మెట్రో సిటీ రేంజ్‌కు చేరే అవకాశాన్నీ విశాఖ చేజార్చుకుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close